LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు - జప్తునకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.!!

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన రూ. 70.36 కోట్ల విలువైన అక్రమాస్తులను సిట్ గుర్తించింది. తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో తల్లిదండ్రుల పేరిట ఉన్న ఈ ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

AndhraPravasi News Desk 2 min read
AP Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు - జప్తునకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.!!

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన మరిన్ని అక్రమ ఆస్తులను ప్రత్యేక విచారణ బృందం (సిట్) తాజాగా గుర్తించింది. అవినీతి సొమ్ముతో తన తల్లిదండ్రుల పేరిట భారీగా భూములు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు.

విచారణలో తేలిన వివరాల ప్రకారం..తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో రాజ్ కసిరెడ్డి సుమారు రు. 70.36 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారు. అయితే, ప్రభుత్వ కళ్లు కప్పేందుకు రిజిస్ట్రేషన్ పత్రాల్లో వీటి విలువను కేవలం రు. 2.85 కోట్లుగా మాత్రమే చూపించారు. మిగిలిన భారీ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించి ఈ లావాదేవీలు పూర్తి చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించి, తెరవెనుక కోట్లాది రూపాయల ముడుపుల సొమ్మును మళ్లించినట్లు ఆధారాలు లభించాయి.

ఈ అక్రమాస్తుల వివరాలను పరిశీలిస్తే, షాబాద్ ప్రాంతంలో నిందితుడి తల్లి సుభాషిణి పేరిట 17.60 ఎకరాల భారీ భూమి ఉన్నట్లు తేలింది. అలాగే, జనగామలో తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరిట విలువైన ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ ఆస్తులన్నీ మద్యం కుంభకోణంలో వచ్చిన అక్రమ సంపాదనతోనే కొన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. దీంతో ఈ ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది.

ఆస్తుల జప్తు ప్రక్రియలో భాగంగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సిట్ దాఖలు చేయనున్న పిటిషన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతి లభించడంతో, కోర్టు ద్వారా ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది.

ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి చెందిన పలు విలువైన ఆస్తులను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ లోతుగా సాగుతున్న కొద్దీ మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుర్తించిన ఈ రూ. 70 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేస్తే, నిందితుడికి గట్టి దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో కూడా సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…