LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Farmers: రైతులకు శాస్త్రీయ మార్గదర్శకంగా “పశుసంవర్ధక మార్గదర్శిని” ప్రారంభం

Farmers: ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో మార్గనిర్దేశం చేయడానికి “పశుసంవర్ధక మార్గదర్శిని” అనే ఈ-మేగజైన్‌ను రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు…

AndhraPravasi News Desk 2 min read
Farmers: రైతులకు శాస్త్రీయ మార్గదర్శకంగా “పశుసంవర్ధక మార్గదర్శిని” ప్రారంభం

పాడి పశువుల నుంచి కోట్ల ఆర్థిక వృద్ధి..

రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చ‌ర్య‌లు..

ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో మార్గనిర్దేశం చేయడానికి “పశుసంవర్ధక మార్గదర్శిని” అనే ఈ-మేగజైన్‌ను రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పాడి పశువులు, చిన్న జీవాలు, నాటు కోళ్ల పెంపకంతో అనుబంధంగా ఉన్నారని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ రంగం ద్వారా రూ.1,76,151 కోట్ల స్థూల విలువ వృద్ధి నమోదవడం పశుసంవర్ధక రంగ ప్రాధాన్యతను చూపిస్తోందన్నారు. అయితే సంప్రదాయ పద్ధతులు, కూలీల కొరత, పశుగ్రాసాల లోపం, పెరుగుతున్న దాణా ఖర్చులు వంటి సమస్యలు వృద్ధికి అడ్డంకులుగా మారుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం యువత సాంకేతిక రంగాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, పశుసంవర్ధక రంగంలో వాణిజ్య అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని మంత్రి సూచించారు. పాడి పశువులు, నాటు కోళ్లు, పందుల పెంపకం వంటి రంగాల్లో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నంలోని రాష్ట్ర పశుగణ యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1500 మంది శిక్షణ పొందగా, అందులో 200 మంది రైతులు వాణిజ్యపరంగా విజయవంతంగా తమ వ్యాపారాలను ప్రారంభించారని వెల్లడించారు.

రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఈ-మేగజైన్‌ను ఏప్రిల్ నెల నుంచి “స్మైల్” వెబ్‌సైట్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందుబాటులో ఉంచారు. ఇందులో పశు ఆరోగ్యం, పోషణ, పునరుత్పత్తి, యాజమాన్యం, మార్కెటింగ్, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై సమగ్ర సమాచారం, నిపుణుల సూచనలు, విజయగాథలు అందిస్తారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే పశుసంవర్ధక సహాయకులు, గోపాల మిత్రులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడంలో ఈ మేగజైన్ ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.

పశుసంవర్ధక రంగాన్ని సేంద్రియ, వాణిజ్య పద్ధతుల్లో అభివృద్ధి చేస్తే ఒక్క ఎకరం నుంచి సంవత్సరానికి రూ.5 నుంచి 6 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించినట్లుగా ప్రతి ఇంట్లో ఒక ఎంట్రప్రెన్యూర్ ఏర్పడి, రైతుల ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డా. వై. సింహాచలం, జాయింట్ డైరెక్టర్ డా. బైరాగి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…