LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు!

Kollu Ravindra: మచిలీపట్నంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుంటే, దాన్ని చూసి ఓర్వలేక జగన్ రెడ్డ…

AndhraPravasi News Desk 2 min read
Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు!

ఐదేళ్ల పాలనలో అమరావతి రైతులపై చేయని అరాచకం లేదు..

ఇప్పుడు రైతులకు అన్యాయమంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారు..

మచిలీపట్నంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుంటే, దాన్ని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.

అమరావతి రైతులపై గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు సృష్టించారని, ఇప్పుడు అదే రైతుల పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపడం రాజకీయ స్వార్థమేనన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య విభేదాలు పెంచారని, భూములు ఇచ్చిన రైతులపై కేసులు పెట్టి, నిరసనలు అణిచివేసేందుకు బలప్రయోగం చేశారని విమర్శించారు.

అమరావతి నిర్మాణం ఇప్పుడు వేగంగా జరుగుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రైతులకు ప్లాట్ల కేటాయింపులు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, అధికారుల కమిటీలు, కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకే భూ కేటాయింపులు జరుగుతున్నాయని వివరించారు. అమరావతి పేరుతో ప్రజల్లో అపోహలు సృష్టించడం సిగ్గుచేటని అన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, ప్రజాధన దుర్వినియోగంపై కూడా మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, రుషికొండలో విలాసవంతమైన నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల పేదల ఇళ్లను కూల్చివేశారని కూడా విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన దిశలో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాయలసీమలో కియా తర్వాత డ్రోన్స్, డిఫెన్స్ రంగ సంస్థలు తీసుకొచ్చామని, తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా రాష్ట్రానికి వచ్చిందన్నారు. ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం, గూగుల్ డేటా సెంటర్, అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చామని చెప్పారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలను సీఆర్డీఏ పరిధిలో చేర్చేందుకు ప్రతిపాదనలు పంపామని, మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ కోసం డీపీఆర్ సిద్ధమవుతోందన్నారు. విజయవాడ-మచిలీపట్నం రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నట్లు తెలిపారు. అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అభివృద్ధి కూడా చేపడుతున్నామని వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కూడా మంత్రి తప్పుబట్టారు. దేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలబెట్టేందుకు మోదీ కృషి చేస్తున్నారని, అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం ప్రజలు సహించరని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…