LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు!

Power Supply: ఆచంట నియోజకవర్గంలో సోమవారం అభివృద్ధి పనుల సందడి కనిపించింది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

AndhraPravasi News Desk 2 min read
Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు!

విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్న ప్రభుత్వం..

పశ్చిమ గోదావరిలో రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ పనుల ప్రారంభం..

ఆచంట నియోజకవర్గంలో సోమవారం అభివృద్ధి పనుల సందడి కనిపించింది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా గ్రామపంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, కొత్త రహదారులు, సోలార్ ప్రాజెక్టులు, విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రజలకు అంకితం చేశారు. నత్తారామేశ్వరం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.20.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ – విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు. గడువు గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించగా, నౌడూరు సెంటర్ నుంచి బ్రహ్మణ చెరువు వరకు రూ.2.50 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రజలకు అంకితం చేశారు.

అలాగే నెగ్గిపూడి గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులను ప్రారంభించారు. పెనుగొండ మండలంలోని 132/33 కెవి సబ్ స్టేషన్‌లో కొత్త 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించడం ద్వారా విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుందని అధికారులు తెలిపారు. వడలి నుంచి జాతీయ రహదారి-16 వరకు రూ.50 లక్షలతో నిర్మించిన డబ్ల్యూబీఎం రహదారిని కూడా మంత్రులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టామని వెల్లడించారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్యుత్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

ప్రజలపై అదనపు భారం పడకుండా గత రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, వినియోగదారుల ఫిర్యాదులకు అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు.

కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. పెరుగుతున్న గృహ, వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో మరిన్ని సబ్ స్టేషన్లు అవసరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు.

ఆచంట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ పితాని సత్యనారాయణ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీసీ వర్గాలకు సబ్సిడీతో పాటు అదనంగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఇతర వర్గాల వారికి కూడా సబ్సిడీతో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.

పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు సౌర విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాలతో ఆచంట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చినట్లుగా స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…