LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Gas News: బుకింగ్ చేసిన రెండ్రోజులకే ఇంటికి గ్యాస్.. ఏపీ సర్కార్ యాక్షన్ ప్లాన్ అదిరింది!

AP Civil Supplies Department: ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత తీరుతోంది. విశాఖ పోర్టుకు చేరుతున్న అంతర్జాతీయ నౌకల వల్ల సరఫరా మెరుగుపడిందని, బుకింగ్ చేసిన రెండు రోజుల్లోనే డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ వెల్లడించింది..

AndhraPravasi News Desk 2 min read
AP Gas News: బుకింగ్ చేసిన రెండ్రోజులకే ఇంటికి గ్యాస్.. ఏపీ సర్కార్ యాక్షన్ ప్లాన్ అదిరింది!

AP Civil Supplies Department: గత కొద్ది రోజులుగా గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరసరఫరాల శాఖ ఒక తీపి కబురు అందించింది. రాష్ట్రంలో సిలిండర్ల డెలివరీ ప్రక్రియ ఇప్పుడు మునుపటి కంటే వేగవంతమైందని అధికారులు ప్రకటించారు. బుకింగ్ చేసుకున్న తర్వాత డెలివరీకి మధ్య ఉన్న సమయం  క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత రెండు రోజులుగా బుకింగ్‌ల కంటే డెలివరీలే ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలో కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడటంతో మార్చి నెలలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్చి రెండో వారంలో ఒక్కో రోజుకు దాదాపు 5 లక్షల వరకు బుకింగ్‌లు ఉండటంతో బ్యాక్‌లాగ్ పెరిగిపోయింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న చొరవతో ప్రస్తుతం పరిస్థితి చక్కబడుతోంది. ప్రజలు గ్యాస్ కొరత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాజా గణాంకాలను పరిశీలిస్తే, ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,11,302 మంది కొత్తగా గ్యాస్ బుక్ చేసుకోగా, ఏకంగా 2,77,367 సిలిండర్లను పంపిణీ చేశారు. అలాగే ఏప్రిల్ 5 (ఆదివారం) నాడు కూడా 2.25 లక్షల బుకింగ్‌లకు గాను, సుమారు 2.92 లక్షల డెలివరీలు జరిగాయి. ఇందులో పాత బాకీలు (బ్యాక్‌లాగ్) కూడా కలిసి ఉన్నాయి. అంటే, బుకింగ్ అయిన కొత్త సిలిండర్లతో పాటు పెండింగ్‌లో ఉన్న పాత ఆర్డర్లను కూడా గ్యాస్ ఏజెన్సీలు వేగంగా క్లియర్ చేస్తున్నాయి.

గ్యాస్ సరఫరా పెరగడానికి ప్రధాన కారణం విశాఖపట్నం పోర్టుకు భారీగా చేరుతున్న గ్యాస్ నౌకలే. రష్యా, ఇరాక్, ఖతార్ వంటి దేశాల నుంచి వరుసగా నౌకలు విశాఖ తీరానికి చేరుకుంటున్నాయి. గత నెలలో 24 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వచ్చిన 'బీడబ్ల్యూ బ్రిచ్' నౌకతో పాటు, ఈ నెల 2, 5 తేదీల్లో మరికొన్ని నౌకలు చమురు, గ్యాస్‌ను అన్‌లోడ్ చేశాయి. దేశంలోని ముంద్రా పోర్టు నుంచి కూడా గ్యాస్ నిల్వలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి.

 గ్యాస్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదని తెలుస్తోంది. గ్యాస్ కంపెనీలు తమ సరఫరా నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయడంతో పాటు, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం వల్ల సామాన్య ప్రజలకు ఊరట లభించినట్లయింది. పోర్టుల నుంచి గ్యాస్ నిల్వలు బాట్లింగ్ ప్లాంట్లకు, అక్కడి నుంచి ఏజెన్సీలకు నిరంతరం చేరుతుండటంతో రానున్న రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రానుంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…