పలువురు మావోయిస్టులు శనివారం ఉదయం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వారి వివరాలను డీజీపీ మీడియాకు వివరించారు. లొంగిపోయిన వారిలో రామకృష్ణ, అరుణ ఉన్నారని పేర్కొన్నారు. ఏవోబీ పరిధిలో భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు.
ఏకే 47, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయన్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రానికి చెందిన దాదాపు 21 మంది ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పనిచేస్తున్నారని చెప్పారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.