గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆయన మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, అలాగే పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.