వైకాపా ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని.. దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీ ఏర్పాటు చేశామని.. దీంతో నేరస్థులను అణచివేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు. గత ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. దీన్ని సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గంజాయి నియంత్రణపై సీఎం ప్రత్యేక దృష్టి: మంత్రి నారా లోకేశ్
అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గంజాయి కట్టడిపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని స్పీకర్ను కోరారు. ఈ సమావేశాలు లేదా వచ్చే సమావేశాల్లోనైనా చర్చ నిర్వహించాలని ప్రతిపాదించారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం నియమించినట్లు చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారని వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: