Minister Savitha: జగన్పై మంత్రి సవిత ఘాటు విమర్శలు!
Minister Savitha: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మంత్రి సవిత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
జగన్ అరాచకాలకు బీసీలు బలవుతున్నారు..
హత్యలు చేయించేవారెవరినీ ప్రభుత్వం వదిలిపెట్టదు..
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మంత్రి సవిత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
“జగన్ అరాచకాలకు బీసీలు బలవుతున్నారు” అని ఆమె అన్నారు. పెద్దదస్తగిరి హత్య ఘటనపై స్పందిస్తూ, “ఈ హత్య జగన్ ఆదేశాలతోనే జరిగిందని ఆరోపించారు. అధికారం, డబ్బు కోసం ఎవరినైనా చంపించడమే జగన్ లక్ష్యం” అని ఘాటుగా విమర్శించారు.
హత్యలు చేయించేవారెవరినీ ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేసిన మంత్రి, ఈ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కాస్త… ఇప్పుడు గొడ్డలిగా మారుతోంది” అంటూ విమర్శలు గుప్పించారు.
పెద్దదస్తగిరి విషయంలో మాట్లాడుతూ, “జగన్ కోసం పెద్దదస్తగిరి అన్నీ తానై పనిచేశారు. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?” అని ప్రశ్నించారు. మంత్రి సవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Be the first to react