LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravati Construction Updates: రాజధాని చుట్టూ పోలీస్ పహారా...‌ 6 చెక్ పోస్టుల ఏర్పాటుతో గుంటూరు ఎస్పీ కీలక నిర్ణయం.

Amaravati Construction Updates: అమరావతి రాజధానిలో శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనుల మధ్య వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. రాయపూడిలో పైపులు తగలబెట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రత దృష్ట్యా గుంటూరు ఎస్పీ రాజధాని చుట్టూ 6 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘా…

AndhraPravasi News Desk 2 min read
Amaravati Construction Updates:  రాజధాని చుట్టూ పోలీస్ పహారా...‌ 6 చెక్ పోస్టుల ఏర్పాటుతో గుంటూరు ఎస్పీ కీలక నిర్ణయం.

Amaravati Construction Updates:  ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ ఊపు అందుకోవడంతో రాజధాని ప్రాంతం అంతా సందడిగా మారింది. అయితే, ఇదే సమయంలో అక్కడ జరుగుతున్న కొన్ని అనుమానాస్పద ఘటనలు ప్రభుత్వం  పోలీసు యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ సంస్థలకు చెందిన పైపులు వరుసగా దగ్ధమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మూడు చోట్ల, మూడు సార్లు పైపులు తగలబడటాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ఎవరైనా కావాలనే ఇలా చేస్తున్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 23న రాయపూడిలో ఉన్న 'మెగా' సంస్థకు చెందిన డంపింగ్ యార్డులో భారీ ఎత్తున పైపులు కాలిపోయాయి. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనే ఆ పైపులను తగలబెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ప్రస్తుతం కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు.

ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. రాజధాని నిర్మాణ ప్రాంతాల్లో ఇకపై ఇలాంటి దొంగతనాలు గానీ, అగ్నిప్రమాదాలు గానీ జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతం చుట్టూ ఆరు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిఘా పెంచడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు భావిస్తున్నారు.

ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ మూడు మండలాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు చెక్ పోస్టులను సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలోకి వచ్చే వాహనాలను, కొత్త వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. నిర్మాణ సామగ్రి చోరీకి గురికాకుండా ఉండటానికి పెట్రోలింగ్‌ను కూడా ముమ్మరం చేశారు.

ప్రభుత్వం అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తరుణంలో ఇలాంటి ఆటంకాలు ఎదురవ్వడం కలకలం రేపుతోంది. కుట్ర కోణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని తేల్చడానికి నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగాయి. మరోవైపు నిర్మాణ సంస్థలు కూడా తమ యార్డుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయాలని పోలీసులు సూచించారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…