LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళులు!

NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘనంగా నివాళులర్పించారు.

AndhraPravasi News Desk 1 min read
NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళులు!

ఆయన ఆశయాలే టీడీపీకి మార్గదర్శకం..

ఎన్టీఆర్ చూపిన బాటలోనే టీడీపీ ప్రయాణం..

అమరావతి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను, ఆయన వ్యక్తిత్వాన్ని మంత్రి భావోద్వేగంగా స్మరించుకున్నారు.

ఎన్టీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగు ప్రజల స్వాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేతగా ఆయనను కొనియాడారు. ఢిల్లీ పెద్దల ఎదుట తెలుగు వారి దమ్ము ఏంటో నిరూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.

సినీ రంగంలో రాముడిగా, కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్, రాజకీయాల్లో కూడా ధృవతారలా వెలిగారని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.

పేదల సంక్షేమం కోసం రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం, మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర రాజకీయ చరిత్రను ఎన్టీఆర్ మార్చేశారని మంత్రి తెలిపారు. ప్రజలే దేవుళ్లు, సమాజ సేవే ధ్యేయం అనే భావనతో రాజకీయాలను ప్రజలకు మరింత చేరువ చేశారని అన్నారు.

తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడేందుకు స్వీయ గౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

అన్నా అంటే నేనున్నానంటూ ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలిచిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తుచేసిన మంత్రి, ఆయన ఆశయాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. నేటి యువత ఎన్టీఆర్ ఆలోచనలను తెలుసుకుని, ప్రజా సేవా భావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, తెలుగు జాతి గౌరవం కోసం ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…