Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Shruti Haasan: వరుస సినిమాలతో బిజీ.. అయినా కిచెన్‌లో ఖాళీ లేదు.. శ్రుతి హాసన్ స్పెషల్ వంటకాలు.! TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Dacoit Movie Review: శేష్-మృణాల్ జోడి అదరగొట్టిందా? 'డెకాయిట్' సినిమా ఎలా ఉందంటే.. పూర్తి రివ్యూ! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Shruti Haasan: వరుస సినిమాలతో బిజీ.. అయినా కిచెన్‌లో ఖాళీ లేదు.. శ్రుతి హాసన్ స్పెషల్ వంటకాలు.! TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Dacoit Movie Review: శేష్-మృణాల్ జోడి అదరగొట్టిందా? 'డెకాయిట్' సినిమా ఎలా ఉందంటే.. పూర్తి రివ్యూ! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి!

Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.!

Amaravati Capital: అమరావతి రాజధానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఈ కథనం బట్టబయలు చేస్తుంది. 2018లో దేశ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి, అమరావతికి వ్యతిరేకంగా వైకాపా సృష్టించిన ఫేక్ వీడియో వెనుక ఉన్న అసలు నిజాన్ని..

Published : 2026-04-10 07:14:00

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. అమరావతికి చట్టబద్ధత లభించి, పనులు వేగవంతం అవుతున్న తరుణంలో, తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన ప్రసంగాలను వక్రీకరిస్తూ, సోషల్ మీడియా వేదికగా ఫేక్ వీడియోలను సృష్టించి కుట్రలకు తెరలేపింది.

అమరావతి అనేది ఒక 'సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు'  అని నిపుణులు చెబుతున్నా, అర్థం లేని ఆరోపణలతో వైకాపా నాయకులు విషం చిమ్ముతున్నారు. తాజాగా, 2018లో అమరావతి బాండ్ల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు వైకాపా అధికారిక 'ఎక్స్'  ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అసలు విషయం ఏమిటంటే, ఆనాడు చంద్రబాబు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం గురించి మాట్లాడారు.

ఆనాటి ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు భారతదేశ ఆర్థిక స్థితిగతుల గురించి వివరిస్తూ.. దేశం సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని, ప్రతి ఏటా 30 శాతం వరకు పొదుపు  సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్తే పదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల సేవింగ్స్ సాధించవచ్చని, దేశ మౌలిక సదుపాయాల కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని ఆయన వివరించారు. దేశం గురించి ఆయన చెప్పిన ఈ గణాంకాలను అమరావతికి ముడిపెడుతూ వైకాపా నీచ రాజకీయాలకు పాల్పడింది.

ముఖ్యమంత్రి దేశానికి 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అని అన్న మాటలను తీసుకుని, దాని ముందు "అమరావతికి" అనే పదాన్ని అతికించి ఒక ఫేక్ వీడియోను తయారు చేశారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయల భారం పడుతోందనే అబద్ధాన్ని ప్రచారం చేయడమే వీరి ప్రధాన ఉద్దేశ్యం. రెండో దశ ల్యాండ్ పూలింగ్ వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. 

వాస్తవానికి అమరావతి ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందనే నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకుంటూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వైకాపాకు అలవాటుగా మారింది. సాంకేతికతను వాడుకుని వీడియోలను ఎడిట్ చేసి, అసత్యాలను నిజాలుగా నమ్మించాలని చూడటం అత్యంత దారుణం. ప్రజలు ఇటువంటి ఫేక్ వీడియోలను, కుట్రపూరిత ప్రచారాలను  నమ్మరని తెలుపుతున్నారు. రాజధాని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారి అసలు రంగును గమనించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Spotlight

Read More →