108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Sea-Plane: విశాఖ టు పాడేరు కేవలం 20 నిమిషాలే.. సీప్లేన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!! PM Modi: ఈ రోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం!! Delimitation: డీలిమిటేషన్ వెనుక బీజేపీ పెద్ద కుట్ర! ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు..! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్! AP Speaker: హరివంశ్ నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక నిదర్శనం.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు! Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Sea-Plane: విశాఖ టు పాడేరు కేవలం 20 నిమిషాలే.. సీప్లేన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!! PM Modi: ఈ రోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం!! Delimitation: డీలిమిటేషన్ వెనుక బీజేపీ పెద్ద కుట్ర! ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు..! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్! AP Speaker: హరివంశ్ నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక నిదర్శనం.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు! Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..!

Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే!

Tirumala Latest Update: నేడు (ఏప్రిల్ 18, 2026) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 6 గంటలు, టోకెన్ భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న 69,049 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం ₹3.57 కోట్లుగా నమోదైంది.

Published : 2026-04-18 08:58:00

Devotional- 11 కంపార్ట్‌మెంట్లలోనే వేచి ఉన్న భక్తులు.

4 గంటల్లోనే సర్వదర్శనం టోకెన్ భక్తులకు దర్శనం.

వీకెండ్‌లోనూ శ్రీవారి చెంత సాధారణ రద్దీ.. 

Tirumala Latest Update: ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం భక్తులు కేవలం 11 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు. కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉండటంతో దర్శనం వేగంగా సాగుతోంది. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 06 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన లేదా ముందస్తుగా సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు కేవలం 3 నుండి 4 గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది.

రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 నుండి 3 గంటల సమయం పడుతోంది. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదం, తాగునీరు మరియు పాలు నిరంతరాయంగా అందజేస్తోంది. భక్తులు ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నిన్నటి (శుక్రవారం) లెక్కల ప్రకారం, మొత్తం 69,049 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి నిన్న ఒక్కరోజే ₹3.57 కోట్ల ఆదాయం సమకూరింది. రద్దీ తక్కువగా ఉన్న తరుణంలో దర్శనానికి వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Spotlight

Read More →