Devotional- 11 కంపార్ట్మెంట్లలోనే వేచి ఉన్న భక్తులు.
4 గంటల్లోనే సర్వదర్శనం టోకెన్ భక్తులకు దర్శనం.
వీకెండ్లోనూ శ్రీవారి చెంత సాధారణ రద్దీ..
Tirumala Latest Update: ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం భక్తులు కేవలం 11 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు. కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండటంతో దర్శనం వేగంగా సాగుతోంది. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 06 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన లేదా ముందస్తుగా సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు కేవలం 3 నుండి 4 గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది.
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 నుండి 3 గంటల సమయం పడుతోంది. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని కంపార్ట్మెంట్లలో అన్నప్రసాదం, తాగునీరు మరియు పాలు నిరంతరాయంగా అందజేస్తోంది. భక్తులు ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నిన్నటి (శుక్రవారం) లెక్కల ప్రకారం, మొత్తం 69,049 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి నిన్న ఒక్కరోజే ₹3.57 కోట్ల ఆదాయం సమకూరింది. రద్దీ తక్కువగా ఉన్న తరుణంలో దర్శనానికి వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.