Sharif: లైవ్ కెమెరాలు ఆపేసి నాపై దాడి చేశారు.. మంత్రి నేరుగా.. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన.! APNRT: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల సంబరాలు.. ఎన్నారైలకు ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక పిలుపు.. మీ సంతోషాన్ని పంచుకోండి - రవి వేమూరు APThanksIndia: జాతీయ స్థాయిలో ఏపీ గళం - 'X'లో నంబర్ వన్ స్థానంలో.. లక్షలాది ట్వీట్లతో టాప్ ప్లేస్‌కు.. నిమిషాల్లోనే వైరల్.! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా! Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Parliament special session: దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో హైడ్రామా.. ఉత్కంఠ రేపుతున్న ప్రత్యేక సెషన్.! IRCTC: వేసవిలో వైజాగ్ - అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.... Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి! Sharif: లైవ్ కెమెరాలు ఆపేసి నాపై దాడి చేశారు.. మంత్రి నేరుగా.. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన.! APNRT: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల సంబరాలు.. ఎన్నారైలకు ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక పిలుపు.. మీ సంతోషాన్ని పంచుకోండి - రవి వేమూరు APThanksIndia: జాతీయ స్థాయిలో ఏపీ గళం - 'X'లో నంబర్ వన్ స్థానంలో.. లక్షలాది ట్వీట్లతో టాప్ ప్లేస్‌కు.. నిమిషాల్లోనే వైరల్.! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా! Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Parliament special session: దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో హైడ్రామా.. ఉత్కంఠ రేపుతున్న ప్రత్యేక సెషన్.! IRCTC: వేసవిలో వైజాగ్ - అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.... Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి!

US Israel Iran Conflict: డాలర్ వద్దు 'రియాల్' ముద్దు... చమురు నౌకలకు ఇరాన్ భారీ టోల్ షాక్..!

Hormuz Strait: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ భారీగా టోల్ ఫీజు విధిస్తోంది. ఒక్కో నౌకకు 2 మిలియన్ డాలర్ల రుసుము వసూలు చేస్తూ, అమెరికా-ఇజ్రాయెల్ నౌకలపై నిషేధం విధించింది. దీనివల్ల ప్రపంచ చమురు ధరలపై పడే ప్రభావం..

Published : 2026-04-02 17:27:00

Hormuz Strait Toll Fee: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు అతిముఖ్యమైన చమురు రవాణా మార్గం 'హర్మూజ్ జలసంధి'పై తన పట్టు బిగిస్తోంది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి భారీగా టోల్ ఫీజు వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం కనిపిస్తోంది.

రియాల్‌లోనే చెల్లింపు.. భారీగా వసూళ్లు

ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ప్రతి ఆయిల్ ట్యాంకర్ సుమారు 2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.18.90 కోట్లు) టోల్ కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ మొత్తాన్ని డాలర్లలో కాకుండా ఇరాన్ సొంత కరెన్సీ అయిన 'రియాల్‌'లోనే కట్టాలని నిబంధన పెట్టింది. దీనివల్ల అమెరికా డాలర్ పై ఉన్న ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ నిబంధనల కింద కొన్ని నౌకలు క్లియరెన్స్ పొంది ప్రయాణించడం విశేషం.

అమెరికా, ఇజ్రాయెల్‌కు నో ఎంట్రీ!

తమ సార్వభౌమాధికారాన్ని చాటుకోవడమే లక్ష్యంగా ఇరాన్ ఈ అడుగు వేసింది. కేవలం డబ్బు వసూలు చేయడమే కాకుండా, తమ శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ జలసంధిపై పహారా కాస్తూ, తమకు కావాల్సిన దేశాలకు మాత్రమే అనుమతులు ఇస్తోంది. ఇది ప్రపంచ దేశాల మధ్య కొత్త దౌత్య యుద్ధానికి తెరలేపుతోంది.

భారత్‌పై ప్రభావం ఎంత?

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే వెళ్తుంది. భారత్ కూడా తన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే ఇరాన్ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సముద్ర జలాల్లో ఇలాంటి సుంకాలు విధించడం చెల్లదని స్పష్టం చేసింది. యుద్ధం లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని భారత పెట్రోలియం శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

భగ్గుమంటున్న జీ7 దేశాలు

ఇరాన్ తీరుపై అమెరికాతో పాటు జీ7 దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ జలమార్గాలను ఆక్రమించుకోవడం సరైన పద్ధతి కాదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. అటు బ్రిటన్ ప్రధాని కూడా రంగంలోకి దిగి, 35 దేశాల మద్దతుతో ఈ మార్గాన్ని తిరిగి స్వేచ్ఛాయుతంగా మార్చడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. హర్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఒక పెద్ద రాజకీయ చదరంగంగా మారిపోయింది. దీనివల్ల సామాన్యుడిపై ధరల భారం ఎంత పడుతుందో వేచి చూడాలి.

Spotlight

Read More →