Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Middle East War: ఇరాన్ దెబ్బకు కుప్పకూలిన అమెరికా 'ఈగిల్' యుద్ధ విమానం! South Central Railway: ఏపీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ స్పెషల్ రైళ్లన్నీ రెగ్యులర్! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Rashmika Mandanna: అంతర్జాతీయ వేదికపై నేషనల్ క్రష్ సరికొత్త చరిత్ర.. ఇండియా టు జపాన్..! Sankar Foundation: శంకర్ ఫౌండేషన్ అరుదైన రికార్డు... 5.1 లక్షల కంటి ఆపరేషన్లు! పోలవరంలో పెద్దపులి కలకలం.... Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Middle East War: ఇరాన్ దెబ్బకు కుప్పకూలిన అమెరికా 'ఈగిల్' యుద్ధ విమానం! South Central Railway: ఏపీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ స్పెషల్ రైళ్లన్నీ రెగ్యులర్! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Rashmika Mandanna: అంతర్జాతీయ వేదికపై నేషనల్ క్రష్ సరికొత్త చరిత్ర.. ఇండియా టు జపాన్..! Sankar Foundation: శంకర్ ఫౌండేషన్ అరుదైన రికార్డు... 5.1 లక్షల కంటి ఆపరేషన్లు! పోలవరంలో పెద్దపులి కలకలం....

Minister Nimmala: పోలవరం లక్ష్యం 2027.. వచ్చే పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి.. మంత్రి నిమ్మల కీలక ప్రకటన.!

Minister Nimmala: ఏలూరు జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను రాష్ట్ర గవర్నర్‌తో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర జల సంఘం (CWC) ఆమోదించిన డిజైన్లు మరియు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ నిపుణుల అమూల్యమైన సూచనలతో పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.

Published : 2026-04-02 17:04:00
  • నిర్వాసితులకు రూ. 1,943 కోట్ల పరిహారం: కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లోనే భారీ పంపిణీ..
     
  • "డయాఫ్రం వాల్ దాదాపు పూర్తి": జూన్ నాటికి కుడి, ఎడమ కాలువల అనుసంధానమే లక్ష్యం..

Minister Nimmala: ఏలూరు జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను రాష్ట్ర గవర్నర్‌తో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర జల సంఘం (CWC) ఆమోదించిన డిజైన్లు మరియు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ నిపుణుల అమూల్యమైన సూచనలతో పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నామని, ప్రస్తుతం కొత్తగా చేపట్టిన డయాఫ్రం వాల్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి కుడి మరియు ఎడమ కాలువల అనుసంధాన పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, తద్వారా ఈ సీజన్ ప్రారంభంలోనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలను తీసుకెళ్లేలా పనులు శరవేగంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.

ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి నిమ్మల వివరించారు. 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు నిర్వాసితులకు రూ. 700 కోట్ల పరిహారం అందించారని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే మూడు విడతలుగా రూ. 1,943 కోట్ల భారీ పరిహారాన్ని పంపిణీ చేసినట్లు తెలిపారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ. 3.5 లక్షలు, ఇంటి స్థలం కోసం రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని, వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రత్యేకంగా 'గ్రీవెన్స్ సెల్' ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Spotlight

Read More →