National Highway: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో... రూట్ ఇదే!

రైల్వేల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ప్రశంసనీయం. ముఖ్యంగా, మోడీ ప్రభుత్వ హయాంలో వేగవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలిచిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, తక్కువ సమయంలోనే ప్రయాణికులను గమ్యానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రైళ్ల సేవలు, నిర్వహణలో మరింత సౌలభ్యం కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) కొన్ని కీలక మార్పులను ప్రకటించింది.

Scholarship Alert: ఏపీలో విద్యార్థులకు అలర్ట్! రూ.6000 స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్! త్వరపడండి..

ఈ మేరకు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్‌ను సవరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 16న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.  ఈ మార్గంలో ప్రయాణించే వారికి కొత్త అవకాశాలను కల్పిస్తుంది.షెడ్యూల్ మార్పులు మరియు సామర్థ్యం పెంపు ప్రయాణికుల రద్దీ మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌సిఆర్ ఈ మార్పులను తీసుకు వస్తున్నామని తెలిపారు. ఈ మార్పులు డిసెంబర్ 4, 2025 నుండి అమలులోకి వస్తాయి.

Bar Licence: బార్ లైసెన్సుల గడువు పొడిగింపు! ఎప్పటివరకంటే!

హైదరాబాద్–బెంగళూరు (కాచిగూడ–యశ్వంత్‌పూర్) మార్గంలో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇకపై శుక్రవారం మినహా అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, ఈ మార్గంలోని రైలుకు కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేసామని తెలిపారు అదేవిధంగా ఈ సవరించిన షెడ్యూల్ డిసెంబర్ 4, 2025 నుండి అమలవుతున్నాయని తెలిపారు.

Nagarjuna Sagar: నిండుకుండలా మెరిసిన నాగార్జునసాగర్ జలాశయం!

సికింద్రాబాద్–విశాఖపట్నం మార్గంలో, వందే భారత్ సేవలు సోమవారం మినహా ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త షెడ్యూల్ డిసెంబర్ 5, 2025 నుండి అమలులోకి వస్తుంది. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ సెప్టెంబర్ 12న విడుదల చేసిన ప్రకటనలో, ఈ మార్పులు రైలు కార్యకలాపాలను మరింత సున్నితంగా మార్చి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయని తెలిపారు.

TRAI Statement: జియో, ఎయిర్టెల్ ₹249 ప్లాన్ తొలగింపు! వినియోగదారుల్లో గందరగోళం...

వందే భారత్ రైళ్లకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రైళ్ల ఆక్యుపెన్సీ రేటు 102.01% కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఇది 105.03%కి పెరిగింది. ఈ గణనీయమైన వృద్ధి, రైల్వేల అభివృద్ధిలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనం.

Vahana mitra: అక్టోబర్ 1 నుంచి వాహనమిత్ర పథకం! కొత్త మార్గదర్శకాలు.. దరఖాస్తు వివరాలు!
Tollywood: మరో సెలబ్రిటీ బ్రేకప్.. ఆ హీరో ప్రేమ కథ విషాదాంతం.. కారణం ఇదే.!
Bus Terminal: ఏపీలో ఆ జిల్లా దశ తిరిగినట్లే ! కొత్తగా బస్ టెర్మినల్! మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌...
DSC final selection: రేపు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్.. వేలాది అభ్యర్థుల్లో ఉత్సాహం! ఈ నెల 19న అమరావతిలో!