Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజున తిరుమల ఆలయం దాదాపు 12 గంటలు మూసివేత!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) విస్తృతమైన ఏర్పాట్లు ప్రారంభించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఓటర్ల జాబితా సిద్ధం చేయడం నుండి పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల వరకు అన్ని ప్రక్రియలు వేగవంతం అవుతున్నాయి.

Bahrain Incident : బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి.. 19 మందికి రెండేళ్ల జైలుశిక్ష! ఇండియన్ ఎంబసీ ద్వారా..

గ్రామ పంచాయతీల ఎన్నికలకు తుది ఓటర్ల జాబితా అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ మేరకు SEC ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల వారీగా ఫోటో ఓటర్ల జాబితా తయారుచేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Nagarjunasagar : కృష్ణమ్మ శాంతించింది.. కానీ రైతుల కళ్లలో మిగిలిన నీరు కన్నీళ్లే!

ఎల్లుండి లోపు ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి సంబంధిత గ్రామ పంచాయతీ, ఎంపీపీ కార్యాలయాల్లో ప్రదర్శించాలి. ఆ తరువాత ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 30న ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

USA Visa: H-1B వీసాదారుల్లో పెరిగిన ఒత్తిడి! గ్రీన్ కార్డ్ కోసం కొత్త మార్గాలు! అమెరికాలో భారతీయుల కష్టాలు..

SEC ఈనెల 29న మండల స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా ప్రక్రియ, రిజర్వేషన్ల కేటాయింపు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇది రాబోయే ఎన్నికలకు సంబంధించి పార్టీలకు మొదటి దిశానిర్దేశం అవుతుందని భావిస్తున్నారు.

Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు సువర్ణావకాశం..! రూ.1 లక్ష నుంచి రూ.3.5 లక్షల వరకు..!

ప్రస్తుతం ప్రభుత్వ స్థాయిలో అత్యంత చర్చనీయాంశం రిజర్వేషన్ల అంశమే. ముఖ్యంగా బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ఈ ప్రతిపాదనపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరారు. నివేదికతో పాటు న్యాయ సలహా కూడా తీసుకుంటున్నారు. కమిటీ సిఫార్సులు, కోర్టు అభిప్రాయం ఆధారంగా రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Indian Navy: భారత నేవీలో చరిత్రాత్మక రోజు..! ఒకేసారి రెండు యుద్ధనౌకల ఆవిష్కరణ!

స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 29న జరగనున్న కేబినెట్ భేటీలో స్పష్టత రానుంది. రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. అదే నెలాఖరులో పోలింగ్ కూడా జరగొచ్చని సమాచారం.

USA Program: హ్యూస్టన్ లో దిగ్విజయవంతంగా జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”.. రెండు రోజులపాటు, 28 విభిన్న వేదికలలో.!

గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం చురుకుగా మారింది. అధికారపక్షం నుండి ప్రతిపక్షం వరకు అందరూ బీసీ రిజర్వేషన్లపై దృష్టి సారించారు. గ్రామాల్లో ఇప్పటికే స్థానిక నాయకులు బలగాలను కూడగడుతూ ప్రచార యత్నాలు మొదలుపెట్టారు. సాధారణ ప్రజలు మాత్రం అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఆధారంగా నాయకులను పరీక్షించాలని భావిస్తున్నారు.

Magic drains: గ్రామాల్లో కొత్త ప్రయోగం.. మేజిక్ డ్రైన్లతో శుభ్రమైన వాతావరణం!

ప్రస్తుతం ప్రజలు, పార్టీలు, అభ్యర్థులందరూ కేబినెట్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే కొన్ని రోజులు తెలంగాణ రాజకీయాలకు కీలకమయ్యే అవకాశముంది. ఎన్నికల ప్రకటన వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సందడి మరింత పెరగడం ఖాయం.

AP liquor Case: జగన్ కి మరో షాక్.. ఎంపీల నుంచి ఐపీఎస్‌ల వరకు.. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు!
Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక..! పలు రైళ్లకు షెడ్యూల్‌ చేంజ్!
Minister Meeting: అల్పపీడనంతో ప్రభుత్వం అలర్ట్.. భారీ వర్షాలపై అన్ని శాఖలకు దిశానిర్దేశం.. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం!
Apple: భారత్‌లో యాపిల్ వేగం! ఐదు ఫ్యాక్టరీలతో భారీ ప్రణాళికలు..!
Without platform : ప్లాట్ ఫామ్ లేకుంటే సమస్య తీరదు.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ !