Swarnamukhi River: స్వర్ణముఖి నది విషాదం..! మూడు మృతదేహాలు లభ్యం!

ఒకప్పుడు సినిమా నిర్మాణంలో భాగంగా స్టూడియోలలో లేదా ఇండోర్‌లలో భారీ సెట్లు వేసి, కథకు అనుగుణంగా సన్నివేశాలను చిత్రీకరించేవారు. అయితే, ప్రస్తుత కాలంలో హీరోల స్థాయి, దర్శకుల విజన్ మరియు బడ్జెట్‌ను బట్టి సినిమా మేకింగ్ విధానాలు మారుతున్నాయి. ప్రేక్షకులను ఆకర్షించేలా సహజమైన లుక్ మరియు భారీతనం అవసరం కావడంతో, దర్శకులు ప్రపంచంలోని ప్రత్యేకమైన లొకేషన్ల కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాలపై మొగ్గు చూపడం అనేది టాలీవుడ్‌లో ఒక ప్రధాన ట్రెండ్‌గా మారింది.

AP Sports: విద్య నుంచి క్రీడల దాకా – ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్!!

నిజానికి, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు సెక్యూరిటీ సమస్యలు, లీక్‌ల భయం లేదా బడ్జెట్ పరిమితుల కారణంగా ఇండోర్ సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. కానీ, పెద్ద చిత్రాలకు ఈ పద్ధతి వర్తించదు. కథా నేపథ్యం, భారీతనం మరియు అధిక సంఖ్యలో సన్నివేశాలు ఉంటాయి కాబట్టి, దర్శకులు అత్యంత సహజమైన చిత్రీకరణ కోసం విదేశాలను వెతుకుతున్నారు. ఈ అన్వేషణలో భాగంగా, ఆఫ్రికా దేశాలు ఇప్పుడు టాలీవుడ్‌కు కొత్త, హాట్ ట్రెండ్‌గా మారుతున్నాయి.

Gulf Air: షాకిచ్చిన చెన్నై కోర్టు! రూ.లక్ష జరిమానా..

తాజాగా రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలు ఆఫ్రికాలోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' (ప్రచారంలో ఉన్న పేరు). ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. తదుపరి కీలక షెడ్యూల్ కోసం దర్శకుడు ఉత్తర ఆఫ్రికాలోని తునిసియా ప్రాంతంలో లొకేషన్లను పరిశీలించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

PMAY 2.0: ఏపీలో పేదలకు మరో గుడ్ న్యూస్..! ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల వరకూ..! త్వరగా ధరకాస్తు చేసుకోండి..!

దర్శకుడు ప్రశాంత్ నీల్ అక్టోబర్ చివరి వారంలో ఆఫ్రికాకు వెళ్లి, సినిమాకు సరిపోయే లొకేషన్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇటీవల ఓ ప్రైవేట్ షూటింగ్ సమయంలో తారక్‌కు గాయం కావడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది. అయితే, త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ముందుగా నవంబర్‌లో హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసి, ఆ తర్వాత చిత్ర బృందం మొత్తం ఆఫ్రికా దేశానికి పయనం కానుంది.

Chennai Drugs Case: చెన్నై డ్రగ్స్ కేసులో బిగుస్తున్న ఉచ్చు.. ఆ సమాచారం ఆధారంగానే నటులకు సమన్లు!

ఇక రెండవ భారీ ప్రాజెక్టు మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'SSMB29' చిత్రం. ఇది యాక్షన్, అడ్వెంచర్ మరియు మైథలాజికల్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక షెడ్యూల్స్ ఇప్పటికే దక్షిణాఫ్రికాలోని ప్రత్యేక లొకేషన్లలో పూర్తయినట్లు సమాచారం. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాలేదు. నవంబర్ 16న 'టైటిల్ గ్లింప్స్' విడుదల చేసి, ఆ తర్వాత ఒక గ్రాండ్ ఈవెంట్‌లో పూర్తి టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు రిపోర్టులు సమాచారం.

Rains: వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక! ఆ 5 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

పెద్ద బడ్జెట్ సినిమాలకు అవసరమైన సహజమైన, అనూహ్యమైన లొకేషన్లు ఆఫ్రికా దేశాల్లో పుష్కలంగా లభిస్తున్నాయి. అంతేకాకుండా, అక్కడ సెక్యూరిటీ పరంగా అనుకూలత మరియు షూటింగ్‌కు సంబంధించిన ముఖ్య సమాచారం బయటకు రాకుండా (లీక్స్ నివారణ) దర్శకులు నమ్మడం కూడా ఈ ఎంపికకు ప్రధాన కారణాలుగా భావించవచ్చు. ఈ కొత్త ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, భవిష్యత్తులో మరిన్ని తెలుగు చిత్రాలు కూడా తమ కథా నేపథ్యానికి తగ్గట్టుగా ఆఫ్రికాకు వెళ్లే అవకాశం  మెండుగానే  కనిపిస్తుంది.

భారతదేశానికి కొత్త 'స్వర్ణ రాజధాని'.. ఆ ఒక్క జిల్లాలోనే 222 టన్నుల స్వచ్ఛమైన బంగారం! దేశంలోనే అతిపెద్ద గని!
రాష్ట్రానికి జాక్‌పాట్.. నాలుగు నగరాల్లో ఏడు రోజుల పర్యటన.. త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదిరే ఛాన్స్!
Adventure: 83 ఏళ్ల బామ్మ బంజీ జంప్! నెట్టింట వైరల్!
Screen time : మితిమీరిన స్క్రీన్ టైమ్ ప్రమాదకరం.. చిన్నారుల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం!