గురువు లేని విద్యార్థి రాళ్లపై నడిచినట్టే విద్యార్థికి మార్గదర్శకత్వం లేకపోతే బలహీనంగా ఉంటారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి ఈరోజు బాలలు రేపటి పౌరులు అనే ప్రాతిపదిక అందరికి తెలిసినది. అలాంటి పౌరులను తీర్చిదిద్దే గురువుల ఉద్యోగాలో నియమించే విషయంలో నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం గొప్పదని చెప్పవచ్చు.
150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేయడం ఒక చరిత్ర అని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన ఇలా ప్రసంగించారు.
యువగణం పాదయాత్రలో నిరుద్యోగ యువతతో మాట్లాడినప్పుడు నుంచి మెగా డీఎస్సీ ఆలోచన ప్రారంభమైందని లోకేష్ తెలిపారు. నాకు లైఫ్ టైమ్ గురువు మా నాన్న, సీఎం చంద్రబాబు. మిమ్మల్ని చూస్తుంటే నా టీచర్లు గుర్తొస్తారు. స్కూల్లో మంజులా మేడం కొట్టిన దెబ్బలు, రమాదేవి మేడం నేర్పిన డిసిప్లిన్, ఇంటర్లో నారాయణ మాస్టారు బృిడ్జ్ కోర్సు పాఠాలు, అమెరికాలో ప్రొఫెసర్ రాజిరెడ్డి మార్గదర్శకత్వం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నా ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూనే ఉంటారు అని లోకేష్ అన్నారు.
విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం అలాగే ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచేందుకు 9,600 స్కూల్లలో “వన్ క్లాస్-వన్ టీచర్” విధానాన్ని ప్రవేశపెట్టడం విద్యా సంస్థల ముఖ్యమైనదిగా తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును క్యాబినెట్ ర్యాంక్తో సలహాదారుగా నియమించామని పేర్కొన్నారు.
అంతేకాక విద్యార్థులకు పుస్తకాల బరువు తగించి శనివారం నో బ్యాగ్ డే ని ఆమలుచేస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా డీఎస్సీలో 49.9% పోస్టులను మహిళలు పొందడం సంతోషకరమని పేర్కొన్నారు.
నూతన ఉపాధ్యాయులు పట్టుదల, నిబద్ధతతో పనిచేయడం ద్వారా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తారని సమష్టి కృషితో ప్రభుత్వ విద్యావ్యవస్థను దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దాలని ఆయన తెలియజేయడం జరిగింది. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కలసికట్టుగా కృషిచేద్దాం. విద్య అంటే ఫిన్లాండ్, డిల్లీ మాత్రమే కాదు. ప్రపంచానికి ఆంధ్రా మోడల్ అని చూపుదాం మంత్రి లోకేష్ యువ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
