పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కూడా హాజరయ్యారు.
ఈ వేడుకలో రఘురామ మాట్లాడుతూ... ‘ఆంధ్ర రాష్ట్రంలో ఔరంగజేబు లాంటి వాడిని ఓడించి గెలిచిన గొప్ప వ్యక్తి’గా పవన్ కల్యాణ్ను అభివర్ణించారు. ఇప్పుడు రీల్ లైఫ్ లోనూ సత్తా చాటేందుకు హరిహర వీరమల్లు చిత్రంతో వస్తున్నాడని అన్నారు.
అందరిలాగే తాను కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని రఘురామ తెలిపారు. పవన్ కల్యాణ్ మంచి నటుడే కాకుండా, వ్యక్తిత్వం పరంగానూ ఎంతో మంచివాడని కొనియాడారు. నాడు ఛత్రపతి శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారన్నది హరిహర వీరమల్లు సినిమా ద్వారా చూడబోతున్నామని వివరించారు.