ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి రైతులకు అండగా నిలిచింది.. ఈ మేరకు వారికి సబ్సిడీని అందజేస్తోంది . తాజాగా మరోసారి చిత్తూరు జిల్లా లో తోతాపురి మామిడి రైతులకి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది . ఇప్పటివరకు సేకరించిన మామిడికి కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ ఇస్తారు . ఈ సబ్సిడీ మొత్తం రూ.150 కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో ఈ డబ్బు జమ చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు .
కలెక్టరేట్ లో మామిడి పంట వివరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు . ఈ సమీక్షలో జేసీ విద్యాధరి , ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్ , వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్ , మార్కెటింగ్ శాఖ ఏడీ పరమేశ్వరన్ ,ట్టుశాఖ జేడీ పద్మావతి , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు .
మామిడి రైతులకి సబ్సిడీ సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు . జూన్ నెలలో సేకరించిన మామిడికి జులైలో సబ్సిడీ ఇస్తారు . జులైలో సేకరించిన మామిడికి ఆగస్టులో సబ్సిడీ ఇస్తారు . ఏపీ ప్రభుత్వం 2.25 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించింది . ఈ మేరకు 22,435 మంది రైతుల వివరాలను మండల స్థాయి బృందాలకు అందిస్తారు .
ఈ మేరకు గ్రామ స్థాయి అధికారులు తో మండల వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు కలిసి రైతుల వివరాలను పరిశీలిస్తారు. రైతుల బ్యాంకు ఖాతాలు , IFSC కోడ్ , ఈ-క్రాప్ వివరాలను సరి చూస్తారు .
చిత్తూరు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించిన మామిడి రైతులకు కూడా ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది .. ఈ మేరకు వారి జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు . కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం , రొంపిచెర్ల , పలమనేరు , పులిచెర్ల , యాదమరి , సదుం మండలాల అధికారులతో మాట్లాడారు .
మామిడి కాయలకు సంబంధించి సబ్సిడీ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని ఆ బాధ్యత మండల అధికారులపై ఉంది. మొత్తం మీద రైతులకు మరో రూ.150 కోట్లు డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు అధికారులు .