గాజా ప్రాంతంలో ఇటీవల సాధించిన కాల్పుల విరమణ ఒప్పందం కొద్దిగా కొనసాగినా మళ్లీ హింస చెలరేగింది. ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు హమాస్ సైనికులు వారి ప్రాంతంపై దాడులు నిర్వహించారని ఆరోపించారు. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వెంటనే ప్రత్యుత్తర చర్యలకు దిగినట్లు ప్రకటించాయి. IDF స్ఫష్టంచేసినట్లు కాల్పుల విరమణను మేము గౌరవిస్తున్నాం కానీ దానిని ఉల్లంఘించినవారిని మనం నిర్లక్ష్యం చేయలేం అని తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రకటన ప్రకారం ఈ దాడులు ప్రధానంగా హమాస్ యొక్క ఆయుధ నిల్వ కేంద్రాలు, వ్యూహాత్మక సొరంగ మార్గాలు, మరియు కాల్పుల కోసం ఉపయోగించే స్థావరాలను లక్ష్యంగా చేసుకొని జరుగాయి. IDF మొత్తం 120కి పైగా మునిషన్లను ఉపయోగించి సుమారు ఆరు కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ దాడులు సార్వత్రిక భద్రతా క్రమాల ప్రకారం సైనికుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించబడ్డాయి అని తెలిపారు.
దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో హమాస్ దళాలు ఇజ్రాయెల్ దళాలపై యాంటీ-ట్యాంక్ గన్లు తుపాకీ కాల్పులు చేపట్టినట్లు నివేదికలు ఉన్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వీరి కుటుంబాలకు సంతాపం తెలిపారు. దేశ రక్షణలో వీరు చూపిన ధైర్యాన్ని మేము ఎప్పటికీ మరిచిపోలేము అని ఆయన తెలిపారు.
వెంటనే హమాస్ పార్టీ ఈ ఆరోపణలను ఖండించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం మా దళాలు రఫా ప్రాంతంలో దాడులు జరపలేదు. ఈ ఆరోపణలు ఇజ్రాయెల్ ప్రయోజనార్థం చేపట్టబడ్డాయని మేము స్పష్టంగా చెప్పగలము అని పేర్కొన్నారు. ఇరు వైపుల వాదనల మధ్య నిజానికి ఏది? అనేది అంతర్జాతీయ సమాజం ఆందోళనతో పరిశీలిస్తోంది.
గాజా ప్రాంతీయ మీడియా వర్గాలు తెలిపినట్లయితే ఈ దాడుల కారణంగా ఇప్పటి వరకు 68,000 మందికి పైగా మృతులు, 1.7 లక్షలకు పైగా గాయపడినవారని తెలిపారు. ఒక్కరోజే 42 మంది పౌరులు ప్రాణాలను కోల్పోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడుల వల్ల సామాన్య ప్రజల జీవితాలు తీవ్ర భయంతో అసురక్షితంగా మారాయి.
ఇజ్రాయెల్ అధికారులు గాజాకు వెళ్లే మానవతా సహాయ సరఫరాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాలలో తీవ్ర ఆందోళన సృష్టించింది. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఈజిప్ట్ ప్రభుత్వం, మళ్లీ ఇరువర్గాలతో చర్చలను ప్రారంభించింది. అమెరికా మధ్యవర్తిత్వంలో సాధించిన ఒప్పందం పూర్తి అవ్వకముందే ఇరు వైపుల ఉద్రిక్తత మళ్లీ పెరగడం, భయాందోళన పరిస్థితిని సృష్టించింది.