LIVE
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!  •  MATA: మాటా జాతీయ మహాసభల్లో క్రీడా విజేతలకు ఘన సన్మానం!  •  TCA: టీసీఏ ‘హ్యూస్టన్ ఐడల్’కు రంగం సిద్ధం.. ప్రవాస తెలుగు ప్రతిభకు భారీ వేదిక!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Tourism: పాపికొండల పర్యాటకంపై పులి ప్రభావం.. భయంతో తగ్గిన సందర్శకుల రద్దీ!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Mahendragiri Varahi: సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ అవుట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డివోషనల్ మిస్టరీ!  •  Railway UPdates: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 1 నుంచి మారిన తత్కాల్ రూల్స్.. ఆధార్ ఓటీపీ ఉంటేనే టికెట్!  •  Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!  •  US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!  •  Peddi movie: ఆ 15 సీన్లు మా మనోభావాలను దెబ్బతీశాయి.. 'పెద్ది' సినిమా డైలాగులపై ఆదివాసీ సంఘాల ఫైర్!  •  Australia Updates: ఆస్ట్రేలియాలో పసుపు జాతర.. మెల్బోర్న్ మహానాడు ఘన విజయం, 1,200 మందితో రికార్డ్!  •  Janhvi Kapoor: జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ కెమెరా యాంగిల్స్ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్!  •  AP News: గోదావరి రైతాంగానికి తీపి కబురు.. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మార్పునకు ప్రభుత్వం ముహూర్తం! రూ.124 కోట్లతో..  • 
Helping Hand

Gulf Victims: “దేవుడు వరమిచ్చాడు… పూజారి అడ్డుకుంటున్నాడు” – గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఆలస్యం!

Gulf Victims: గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం ఆలస్యమవుతున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పటికీ చాలా కుటుంబాలకు అందకపోవడంతో బాధితులు వేదన వ్యక్తం చేస్తున్నారు.

AndhraPravasi News Desk 2 min read
Gulf Victims: “దేవుడు వరమిచ్చాడు… పూజారి అడ్డుకుంటున్నాడు” – గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఆలస్యం!

50 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు..

దేవుడు వరమిచ్చాడు… పూజారి అడ్డుకుంటున్నాడు..

జగిత్యాల జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం ఆలస్యమవుతున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పటికీ చాలా కుటుంబాలకు అందకపోవడంతో బాధితులు వేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక గల్ఫ్ మృతుడి భార్య ఇటీవల ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించారు. “మాకు ఎక్స్‌గ్రేషియా మంజూరు అయ్యింది. జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. టోకెన్ నెంబర్ కూడా వచ్చింది. కానీ డబ్బులు మాత్రం మా బ్యాంక్ ఖాతాలో పడలేదు” అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గారు గల్ఫ్ మృతుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. పాస్‌పోర్ట్, మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి అవసరమైన పత్రాలను మండల తహసీల్దార్ల ద్వారా వేగంగా సేకరించి, అర్హులైన కుటుంబాలను గుర్తించి ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు పంపించారు. ఆయన కృషిని పలువురు అభినందిస్తున్నారు.

జిల్లాలో మొత్తం 50 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయబడింది. దీనికి మొత్తం రూ.2.5 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే కోరుట్లలో 19, ధర్మపురిలో 14, జగిత్యాలలో 7, వేములవాడలో 6, చొప్పదండిలో 4 కుటుంబాలు ఈ సహాయం కోసం అర్హులుగా గుర్తించబడ్డాయి.

అయితే, మంజూరు ప్రక్రియ పూర్తయినా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాకపోవడం సమస్యగా మారింది. సీఎం హామీ ఇచ్చినా, అమలు దశలో జాప్యం జరగడం బాధిత కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. “దేవుడు వరమిచ్చాడు… పూజారి అడ్డుకుంటున్నాడు” అన్నట్లుగా పరిస్థితి ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఈ సహాయం ఎంతో కీలకం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి, బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ అంశంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటేనే, ఆ కుటుంబాలకు నిజమైన న్యాయం జరిగినట్లు అవుతుంది.

Be the first to react

More Coverage

Oman: ఒమాన్‌లో ఇరుక్కున్న మహిళను రక్షించిన కూటమి కార్యకర్తలు! సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు!

Oman: ఒమాన్‌లో ఇరుక్కున్న మహిళను రక్షించిన కూటమి కార్యకర్తలు! సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు!

Oman: ఉద్యోగం కోసం ఒమాన్‌కు వెళ్లిన ఒక మహిళకు ఎదురైన భయానక అనుభవం చివరికి సుఖాంతం అయింది. ఆంధ్రప్రదే…