నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం: ప్రశ్నిస్తే వేధించడమే జగన్ పని - ఆనం, కోటంరెడ్డిని జగన్ వేధించాడు - జగన్ తానొక్కడే రాజు అని అనుకుంటున్నారు - మనమందరం ఆయన బానిసలమని భావిస్తాడు - అహంకారంతో ఏపీని నాశనం చేసిన వ్యక్తి జగన్ - రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్కు ఇంటికి పంపాలి - ఇది నా కోసమే, పవన్ కళ్యాణ్ కోసమే, వేమిరెడ్డి కోసమో కాదు - రాష్ట్రం కోసం , భావితరాల కోసం జగన్ను ఇంటికి పంపించాలి
ఇంకా చదవండి: చంద్రయాన్-4 కోసం సిద్ధమవుతున్న ఇస్రో!! ప్రయోగం ఎప్పుడు అంటే??
- రాష్ట్రం అంటే మట్టి కాదు.. రాష్ట్రం అంటే మనుషులు - విశాఖను ఊడ్చేసిన వ్యక్తిని ఇప్పుడు నెల్లూరుకు పంపిస్తున్నారు - ఏ1 విజయసాయిరెడ్డి విశాఖను దోచేశాడు - నెల్లూరు కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది - నెల్లూరు జిల్లా జిల్లా ఖాళీ అయిపోయింది - వైసీపీ నాయకులు వరుసగా టీడీపీ చేరుతున్నారు - నేనే స్వయంగా నెల్లూరు వచ్చి వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించానంటే అది వేమిరెడ్డికి ఉన్న ప్రత్యేకత
ఇంకా చదవండి: టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్!!
- రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది - నెల్లూరులో ఒక వైసీపీ నాయకుడు మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డాడు - ఇప్పుడు ఆ నాయకుడిని తన్నితే 3 జిల్లాల అవతల పడ్డాడు -బుల్లెట్ దిగిందా అని డైలాగులు వేసేవాడు.. పల్నాడులో బుల్లెట్ దిగితే ఈసారి చెన్నై పోతాడు - ఫ్లెక్సీలను మార్చినంత సులభంగా అభ్యర్థులను వైసిపీ మారుస్తోంది - ప్రతి విషయంలో మోసం, ధగా చేయడం జగన్కు అలవాటు
ఇంకా చదవండి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పార్టీలపై చర్యలుంటాయని ఈసీ! ప్రార్థన మందిరాల్లో ప్రచారం..
- జగన్ మీటింగ్ పెడితే స్కూళ్లకు సెలవులు - స్కూళ్ల బస్సులు అన్నీ జగన్ సభకు పంపాలి - మనం డబ్బులు కట్టినా ఆర్టీసీ బస్సులు ఇవ్వరు - జగన్ మీటింగ్కు ఫ్రీగా ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు - వైనాట్ కుప్పం అంటున్నాడు జగన్ - వైనాట్ పులివెందుల అని మేం అంటున్నాం - హు కిల్డ్ బాబాయ్..? అంటున్నారు ప్రజలు, నిన్న ఆయన చెల్లెలు నిలదీసింది
ఇంకా చదవండి: మాచర్లలో ఆటవిక రాజ్యం!! మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా? - నారా లోకేష్
- సిద్దం.. సిద్దం.. అంటున్న జగన్ను నేను ప్రశ్నిస్తున్నా - బాబాయ్ హత్యకు సమాధానం చెప్పేందుకు జగన్.. సిద్ధమా? - మొదట గుండెపోటుతో చనిపోయాడని జగన్ చెప్పాడు -తర్వాత గొడ్డలి పోటు అని తేలింది - అంటే ముందుగానే ఆ కుట్రలో జగన్కు భాగస్వామ్యం ఉందని తేలిపోయింది - హత్యలు చేసే వ్యక్తి నాయకుడిగా ఉంటే.. ప్రజల పరిస్థితి ఏంటి?
ఇంకా చదవండి: పిఠాపురం నుంచి పవన్ పోటీ అన్న ప్రచారంతో వైసీపీలో గుబులు! టికెట్ ఇవ్వకుండా అవమానించారని..
- ఈ పాలకులకు పరిపాలించే అర్హత లేదని సునీత అన్నారు - హంతకులు మన మధ్యనే ఉంటారని సునీత చెప్పారు - హత్యకేసు ఏదైనా నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది - వివేకా హత్య కేసు అదిఏళ్లు అయినా తేలలేదు - సోదరి షర్మిలపైనే సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడుతున్నారు - సోదరి పుట్టుకపై సైతం దారుణంగా మాట్లాడుతున్నారు - సోషల్ మీడియాలో రంగనాయకమ్మ పోస్ట్ పెడితే వేధించారు
ఇంకా చదవండి: లండన్ కోటకు కాకుల కాపలా.. కాకులకు నిత్యం మాంసాహారం, వైద్య పరీక్షలు..
- చివరికి రంగనాయకమ్మ హోటల్ మూయించివేశారు - టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఎందుకు బాధ - రెండు పార్టీలు ఓ సయోధ్యకు వచ్చాం - రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన ఒకటి అయ్యాయి - ఎవరికీ, ఎప్పుడూ ఇవ్వని గౌరవం పవన్ కల్యాణ్కు ఇస్తున్నాం.. అది మా పార్టీ సంస్కారం - ఏపీ భవిష్యత్ కోసం కలిసి పనిచేస్తున్నాం - టీడీపీ-జనసేన మధ్య ఒక అవగాహన కుదిరింది - ఉద్యోగాలను కూడా జగన్ సర్కార్ వదలలేదు - చివరికి తమ జీతాలు వస్తే చాలనుకునే దీనస్థితికి వచ్చారు - అన్ని వర్గాలకు అన్యాయం చేశారు.. అన్ని రంగాలకు నాశనం చేశారు: టీడీపీ అధినేత చంద్రబాబు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్మీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: