మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. నవంబరు 11న అసెంబ్లీ లాబీలో ఇతర ఎమ్మెల్యేలతో పాటు కూర్చొని ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ అటువైపుగా వచ్చారని, అందరితో పాటు తాను కూడా లేచి సంస్కారంతో పలకరించానని మంత్రి వెల్లడించారు. అంతకుమించి అక్కడ ఏమీ జరగలేదని, సంస్కారంతో తాను నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో తమ కుటుంబానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని, బొత్స కుటుంబంపై పోరాడుతున్నామని, అలాంటి తాను బొత్స కాళ్లు ఎందుకు పట్టుకుంటానంటూ మండిపడ్డారు. దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. జిల్లాలో బొత్స కుటుంబం వల్ల చాలా మందికి అన్యాయం జరిగిందని, అలాంటివాళ్లు వివరాలు అందజేస్తున్నారని, చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ హెచ్చరించారు. బొత్స కుటుంబం జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. ఈమేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, మంత్రి శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ కాల్లు మొక్కారంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు వైరల్గా మారాయి.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!
చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!
నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!
మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!
ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..
అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!
ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!
వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: