కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపిస్తూ వైసీపీ ధర్నాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవి స్పందిస్తూ... వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వాళ్లే ధర్నాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా ఉండదని చెప్పారు. ధర్నా చేయాల్సింది కలెక్టరేట్ల వద్ద కాదని... జగన్ ఇంటి ముందు చేయాలని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఈఆర్సీకి సిఫారసు చేసింది జగన్ కాదా? అని గొట్టిపాటి ప్రశ్నించారు. గతంలో రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వం మిగులు విద్యుత్ ఇచ్చిందని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ విద్యుత్ రంగ వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. సొంత మనుషులకు దోచి పెట్టేందుకు అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేశారని అన్నారు. రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..
తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!
పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: