ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు.. తాజాగా ఓ కీలక అంశంపై ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బదిలీలపై నిషేధం ఎత్తివేతపై ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీటిలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో వాటిలో మరో మార్పు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల బదిలీపై ఉన్న నిషేధాన్ని గత నెల 19 నుంచి 31 వరకూ ఎత్తేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేయడంలో ఆలస్యం కావడంతో ఆ గడువును ఈ నెల మొదటివారానికి పెంచారు. రాష్ట్రంలో ఓవైపు వరద సహాయక చర్యల్లో ఉద్యోగులు ఉండటంతో మరోసారి ఉద్యోగుల బదిలీలపై ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు.
ఇంకా చదవండి: మాజీ మంత్రికి మరింత బిగుస్తున్న ఉచ్చు! ఏసీబీ పిటీషన్లపై విచారణ వాయిదా!
ఏపీలో ఎక్సైజ్ మినహా మిగిలి శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఇచ్చిన గడువును ఈ నెల 22 వరకూ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల కాగా.. మిగిలిన శాఖల్లో బదిలీలకు ఆయా శాఖలు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి. వీటి ప్రకారం ఈ నెల 22 వరకూ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం సెప్టెంబర్ 23 నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. ఎక్సైజ్ శాఖకు మాత్రం ఈ నెల 30 వరకూ బదిలీల గడువు పొడిగించారు. వీరికి అక్టోబర్ 1 నుంచి బదిలీపై నిషేధం అమల్లోకి వస్తుంది.
ఇంకా చదవండి: టోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడికి కీలక పదవి! తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం!
18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!
ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులపై కేసు!
గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: