అచ్యుతాపురం సెజ్ లో ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం తెలిసిందే. నేడు బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు... ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెడ్ క్యాటగిరీలోని పరిశ్రమలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పరిశ్రమలు బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని అన్నారు. బాధిత కుటుంబాలకు కంపెనీ పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. ఘటనలు జరిగినప్పుడు పరిశ్రమలు వెంటనే అంతర్గత విచారణ జరపాలని ఉద్ఘాటించారు.
ఇంకా చదవండి: కోల్ కతా హత్యాచార ఘటనపై కేజీహెచ్ వద్ద ఆందోళన! మీ కెపాసిటీ మాకు తెలుసు సార్! మద్దతు తెలిపిన సీఎం చంద్రబాబు!
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోతే ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. పరిశ్రమలో ఏం జరిగింది... ప్రమాదం వెనుక కారణాలేంటి, లోపాలపై ఈ కమిటీ విచారిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, పరిశ్రమలకు ఉన్న ఇబ్బందులపైనా కమిటీ విచారిస్తుందని వివరించారు. కమిటీ నుంచి నివేదిక వచ్చాక, ఎవరు తప్పు చేసినట్టు తేలినా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని, ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రమాదాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని, ఎవరైనా కుట్రలు చేసినా ఎక్కువ రోజులు సాగవని హెచ్చరించారు.
ఇంకా చదవండి: కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన! వెలుగులోకి మరో సంచలన విషయం!
అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్!
అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: