ఇటీవల సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో ఎంతో మంది బలవుతున్నారు. సామాన్య ప్రజానీకం నుంచి ప్రభుత్వ అధికారులపై కూడా ఈ సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త తరహా మోసంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల నందిగామ జిల్లాకు చెందిన ఓ మహిళా ఈకేవైసీ పేరుతో మోసం చేశారు. ప్రజలకు సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కూడా చాలా మంది వారి బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో కూడా ఈ కేటుగాళ్లు సైబర్ దాడికి పాల్పడినట్లు సమాచారం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గతంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శినంటూ పలువురు పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఏకంగా వాట్సాప్ డీపీగా సీఎం చంద్రబాబు ఫొటోను పెట్టారని తెలుస్తోంది. ఈ విధంగా చంద్రబాబు ఫొటో డీపీ పెట్టి పలు సార్లు కాల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే!
అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్న జగన్ రెడ్డి! కారణం ఆదేనా!
టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్! నేడు, రేపు భారీ వర్షాలు!
మహారాష్ట్ర సీఎం తో చంద్రబాబు భేటీ! కీలక అంశాలపై చర్చ!
ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: