ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై (Anil Ambani) మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ.. సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. 'రిలయన్స్ హోమ్ ఫైనాన్స్' (RHFL)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
అనిల్ అంబానీపై (Anil Ambani) సెబీ రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనొద్దని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్సు సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆర్నెళ్ల పాటు నిషేధించింది. రూ.6 లక్షల జరిమానా కూడా విధించింది.
అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధులను మళ్లించారని సెబీ తమ నివేదికలో ఆరోపించింది. అందుకోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణాధికారులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. ఆర్ఎఫెచ్ఎల్ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. వాటిని యాజమాన్యం బేఖాతరు చేసినట్లు తెలిపింది. అనిల్ ప్రభావంతో కీలక అధికారులు కావాలనే నిబంధనలను అతిక్రమించారని ఆరోపించింది.
ఇంకా చదవండి: విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!
ఇతర సంస్థలు నిధుల గ్రహీతలుగా లేదా మళ్లింపునకు మధ్యవర్తిగా వ్యవహరించాయని సెబీ తెలిపింది. ఈ రుణాలు పొందిన చాలా కంపెనీలు తిరిగి చెల్లించటంలో విఫలమయ్యాయని వివరించింది. ఫలితంగా ఆర్ఎఫెచ్ఎల్ దివాలా తీసి ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిష్కార ప్రణాళికకు వెళ్లాల్సివచ్చిందని పేర్కొంది. తద్వారా పబ్లిక్ షేర్ హోల్డర్ల పరిస్థితి దుర్భరంగా మారిందని వివరించింది. ఉదాహరణకు 2018లో కంపెనీ షేరు ధర రూ.59.60 వద్ద ఉందని తెలిపింది. 2020 నాటికి కంపెనీ మోసం బయటకు రావడం, నిధులు అడుగంటిపోవటంతో షేరు విలువ రూ.0.75కు పడిపోయినట్లు గుర్తుచేసింది. ఇప్పటికీ తొమ్మిది లక్షల మంది వాటాదారులు నష్టాలతో కొనసాగుతున్నారని వివరించింది.
అనిల్ అంబానీతో పాటు మరికొందరు కీలక అధికారులపైనా సెబీ భారీ జరిమానా విధించింది. మరికొన్ని సంస్థలపై రూ.25 కోట్ల అపరాధ రుసుము చెల్లింపునకు ఆదేశించింది. అక్రమంగా మరికొన్ని సంస్థలపై రూ.25 కోట్ల అపరాధ రుసుము చెల్లింపునకు ఆదేశించింది. అక్రమంగా రుణాలు పొందడం లేదా రుణాలు జారీ అయ్యేందుకు సహకరించినందుకుగానూ వాటిపై చర్యలు తీసుకుంది. 2022లోనూ సెబీ వీరందరిపై నిషేధం విధించడం గమనార్హం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!
విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!
పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!
గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!
దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన! వెలుగులోకి మరో సంచలన విషయం!
అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్!
అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: