ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టింది. 'రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్' పేరుతో 11.53 ఎకరాల్లో నిర్మాణం కోసం డిజైన్లకు టెండర్లను ఆహ్వానించింది. 'ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్'ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. సాయంత్రంలోపు గుత్తేదారులు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అందులో పేర్కొంది. నవంబర్ 28 లోపు ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన న్ను విభజించారు. ఎన్నికలకు ముందు 2 తెలుగు రాష్ట్రాల అధికారులు చర్చించి భవన్ విభజనను ఖరారు చేశారు. 2 రాష్ట్రాల అధికారుల ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న భవనాలను తెలుగు రాష్ట్రాలు కలిసి వినియోగించకుంటున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: