తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఈ ఆవర్తనం ఉండటంతో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యాకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సునామీ వచ్చి 20 సంవత్సరాలు పూర్తికావడంతో మత్స్యకారులంతా విశాఖపట్నం సముద్రతీరంలో గురువారం పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండురోజులు రాష్ట్రంలో వర్షాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు కూడా సూచించారు. ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే అందుకు తగినట్లుగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రావాలన్నారు.

ఇంకా చదవండి: ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

రాష్ట్రంలోని పోర్టులవద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. అల్పపీడన ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, వీలైతే పంటను ఇంటికి చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతికి ఇంటికి రావల్సిన ధాన్యాన్ని రైతులు నెలరోజులు ముందుగానే కోతలు కోసేశారు. పొలాల్లో వరికుప్పలను వేశారు. ఈ తరుణంలో వర్షం పడితే నష్టపోతామని, తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ధాన్యంలో 25 శాతం తేమ ఉన్నప్పటికీ గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆమేరకే ధాన్యం కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి. కొనుగోలు జరిగిన 48 గంటల్లో ప్రభుత్వం రైతులకు డబ్బులు జమచేస్తోంది.



ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల జాబితా సిద్దం! మూడు పార్టీల నుంచి పదవులు ఎవరికంటే? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం ఎప్పుడంటే?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!

రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!

నేడు (26/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group