చలి విజృంభిస్తోంది. చలి పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లోనూ చలి ఎక్కువవుతోంది. మెల్ల మెల్లగా కనిష్ట ఉష్ణోగ్రతలు అన్ని ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి వాతావరణాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని ప్లెయిన్ ఏరియాలలో అలాగే అక్కడి ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్ వంటి జిల్లాలలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదు అవుతోంది. ఈ సీజన్లో ఇదే రికార్డు అని.. గత పదేళ్లతో పోలిస్తే ఇంతలా చలి ఎప్పుడూ లేదని వాతావరణ శాఖ అంటోంది. మరో నెల 15 రోజులు పాటు చలి ఇలాగే కొనసాగుతుందని.. జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.వి.ఎస్. శ్రీనివాస్ వివరించారు. వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం డిసెంబరు అంతా.. జనవరి నెలలో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని సమాచారం. చలి ఎక్కువ కావడానికి ఉత్తరం నుంచి వస్తున్న గాలులే కారణంగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్లో చలి గాలులు పెరుగుతాయని..
ఇంకా చదవండి: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం! ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
అయితే మొన్న నాలుగు తుఫాన్లు కారణంగా చలి తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగిందని వివరించారు. గత పది రోజులలో వరుసగా అల్పపీడన ద్రోణులు కారణంగా తమిళనాడు, కేరళ ఇతర ప్రాంతాల్లో.. ఉష్ణోగ్రతలు పెరిగాయని అయితే ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతూ ఇప్పుడు ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ వివరించారు. వచ్చే జనవరిలో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అన్నారు. అలాగే అటు ఆంధ్రప్రదేశ్ లో ఏజెన్సీ ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం తూర్పుగోదావరి ప్రాంతాలకు ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అరకు పాడేరు అంటే ప్రాంతాల్లో ఐదు డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆంధ్ర కాశ్మీర్ గా పిలిచే లంబసింగిలో మైనస్ డిగ్రీలకు ఈసారి కూడా వెళ్లే అవకాశం ఉందని అయితే ఇది ఈ డిసెంబరు చివరి నాటికి నమోదు అయ్యే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వివరించారు. కాగా ఈ అల్పపీడన ద్రోణి కారణంగా కూడా చలిగాలులు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు వాతావరణ శాఖ అధికారి.
ఇంకా చదవండి: కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
H-1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన.. తాజా అప్డేట్ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!
4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: