LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Vietnam: వియత్నాం ఫు క్వాక్ దీవి ప్రయాణం.. వీసా లేకుండా వెళ్తే జాగ్రత్తలు తప్పనిసరి! భారత రాయబార కార్యాలయం హెచ్చరిక..

Vietnam: Phu Quoc ఐలాండ్ ప్రస్తుతం భారతీయుల కోసం ఆకర్షణీయమైన హాలిడే డెస్టినేషన్‌గా మారుతోంది. భారత ఎంబసీ తాజాగా భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. ముందుగానే వియత్నాం వీసా తీసుకోవాలి..

AndhraPravasi News Desk 2 min read
Vietnam: వియత్నాం ఫు క్వాక్ దీవి ప్రయాణం.. వీసా లేకుండా వెళ్తే జాగ్రత్తలు తప్పనిసరి! భారత రాయబార కార్యాలయం హెచ్చరిక..

భారతీయులు ఫు క్వాక్ దీవికి వీసా లేకుండా వెళ్లవచ్చు..

భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరికలు.. 

వియత్నాం దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం Phu Quoc ఐలాండ్ ప్రస్తుతం భారతీయుల కోసం ఆకర్షణీయమైన హాలిడే డెస్టినేషన్‌గా మారుతోంది. తెల్లని ఇసుక తీరాలు, లగ్జరీ రిసార్టులు, ప్రశాంత వాతావరణం కారణంగా ఈ దీవికి భారతీయ పర్యాటకులు ఎక్కువగా వెళ్లుతున్నారు. ముఖ్యంగా 30 రోజుల పాటు వీసా లేకుండా ప్రవేశానికి అనుమతి ఉండటం దీనికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.

అయితే, హానొయ్ లోని భారత ఎంబసీ తాజాగా భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. ఫు క్వాక్ దీవికి మాత్రమే వెళ్లాలనుకున్నా కూడా ముందుగానే వియత్నాం వీసా తీసుకోవాలని సూచించింది.

ప్రస్తుతం భారతీయులు ఫు క్వాక్ దీవికి వీసా లేకుండా వెళ్లవచ్చు. అయితే ఈ అనుమతి పూర్తిగా ఆ దీవి వరకే పరిమితం. వియత్నాం ప్రధాన భూభాగంలోని నగరాలు—హో చి మిన్ సిటీ, హనోయి వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ వీసా-ఫ్రీ అనుమతి వర్తించదు. ప్రయాణికులు నేరుగా దీవికే చేరుకుని, అక్కడే తమ పర్యటన ముగించాలి. వియత్నామ్ కరెన్సీ: Vietnamese dong, మార్ధ్యమిక మార్పిడీలు (సుమారు): 1 VND ≈ ₹0.00336 గా ఉంది. 

భారతదేశం నుండి వియత్నాం కి చేరుకోవడానికి ప్రధానంగా గగన మార్గమే ఉపయోగపడుతుంది. ముంబయి, ఢిల్లి, బెంగళూరు వంటి నగరాల నుండి హనోయ్, హో చి మిన్ సిటీ కి నేరుగా కొన్ని విమానాలు ఉన్నాయి. కాని ఎక్కువ సంఖ్యలో కనెక్టింగ్ ఫ్లైట్స్ సింగపూర్, బ్యాంకాక్, కువైట్, దుబాయ్ ద్వారా ఉంటాయి. పర్యాటకులు సాధారణంగా వియత్నాం పర్యటనను సింగపూర్, థాయ్‌లాండ్ వంటి ఇతర దక్షిణ ఆసియాకు కలిపి చూస్తారు. విమానం ద్వారా వియత్నాం చేరుకోవడానికి వన్ వే టికెట్ దాదాపు రూ.8,500 నుండి రూ. 15,000 వరకూ ఉంటుంది. 

రాయబార కార్యాలయం ప్రకారం, కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు, ఫ్లైట్ ఆలస్యాలు లేదా ఇతర అవసరాల వల్ల ప్రధాన భూభాగానికి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటి సమయంలో సరైన వీసా లేకపోతే ఆసుపత్రి సేవలు పొందడంలో ఆలస్యం, ప్రయాణ ఆంక్షలు, ఇమ్మిగ్రేషన్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే వీసా తీసుకోవడం ద్వారా ఇలాంటి ఇబ్బందులను నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

వియత్నాంలో పర్యటనలో ఉన్నప్పుడు పాస్‌పోర్ట్ పోయిన ఘటనలు కూడా కొన్ని చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. అలాంటి సమయంలో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత ఆ రిపోర్ట్‌ను హానొయ్ లోని భారత ఎంబసీ లేదా హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్‌కు సమర్పించాలి.

పాస్‌పోర్ట్ పోయిన వారికి భారత రాయబార కార్యాలయం నుంచి ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేస్తారు. సాధ్యమైనంత త్వరగా, కొన్నిసార్లు అదే రోజులో కూడా ఇది అందిస్తారు. 

వియత్నాం ఎంబసీ పూర్తి వివరాలు: 
High Commission of India, Vietnam
No. 12, Pham Van Bach Street
Cau Giay District, Hanoi, Vietnam

Monday to Friday (0900 to 1730)

Contact Information
+84 24 3772 5306 (High Commissioner), 3772 5307 (HOC)

అయితే, వియత్నాం అధికారుల నుంచి ఎగ్జిట్ పర్మిట్ పొందడానికి సాధారణంగా 3 నుంచి 5 పని రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఇంకా ఎక్కువ కాలం తీసుకోవచ్చు. ఆ సమయంలో ప్రయాణికులు వియత్నాంలోనే ఉండాల్సి ఉంటుంది.

మొత్తానికి, ఫు క్వాక్ దీవి పర్యటన ఎంతో అందమైన అనుభవం అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రయాణానికి ముందు పూర్తి సమాచారం సేకరించి, అవసరమైన వీసా తీసుకుని వెళ్లడం ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని రాయబార కార్యాలయం సూచించింది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…