LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగింది.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్!

శిలాతోరణం వరకు క్యూలైన్.. తిరుమలలో భారీ రద్దీ..

తిరుమలలో లక్షలాది భక్తుల రాక.. హుండీ ఆదాయం ₹3.80 కోట్లు..

తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగింది. దీంతో దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 15 నుంచి 20 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 5 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు దర్శనం పూర్తి కావడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.

ఇక గురువారం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా నమోదైంది. ఒక్క రోజులోనే 74,569 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజు హుండీ ఆదాయం రూ.3.80 కోట్లకు చేరింది.

లడ్డూల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. ఒక్కరోజులో 4.15 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. అన్నప్రసాద సేవలో భాగంగా 2.70 లక్షల మంది భక్తులు ఉచిత భోజనాన్ని స్వీకరించారు. మరోవైపు, వైద్య సేవలు కూడా నిరంతరం కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 3,592 మంది భక్తులకు వైద్య చికిత్స అందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సహనం పాటించాలని, దర్శనానికి వచ్చే భక్తులు తగిన ఏర్పాట్లతో రావాలని టీటీడీ సూచించింది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…