LIVE
Fuel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్... త్వరలోనే తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!  •  Prajavedhika: మాజీ మంత్రి బంధువుపై గ్రీవెన్స్‌లో భూ కబ్జా ఫిర్యాదు.... వెబ్‌ల్యాండ్ సాంకేతిక లోపాలతో దొంగ పాస్ పుస్తకాలు.... బాధితులకు మంత్రి నారాయణ భరోసా!  •  APNRT: ప్రవాసాంధ్రులకు సువర్ణావకాశం... విదేశాల్లో కనకదుర్గమ్మ ప్రత్యేక గృహ పూజల సదుపాయం!  •  ఆయుష్మాన్ భారత్ కార్డ్‌తో రూ. 5 లక్షల ఉచిత వైద్యం! పూర్తి వివరాలు...  •  AP Students: విద్యార్థులకు అలర్ట్... ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక ప్రకటన!  •  Chandrababu: జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస.. 11వ తేదీ రాత్రికి..  •  తెరపైకి కొత్త డిమాండ్... మాకు ఎస్సీ హోదా కల్పించండి!!  •  AP Government: సామాన్యుడికి ఊరట.. ఏపీలో త్వరలోనే 1,000 మినీ మార్టుల ఏర్పాటు! ఎక్కడక్కడంటే...  •  New Airport: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్ట్... రూ.648 కోట్లతో నాలుగు జిల్లాలకు పండగే.. 2029నాటికి పూర్తి!  •  Gas Price Hike India: బిగ్ షాక్.. గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించిన కేంద్రం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala News Today: కాన్వాయ్ వదిలి భక్తుల చెంతకు.. తిరుమల వీధుల్లో సామాన్యుడిలా సీఎం చంద్రబాబు..!!

Tirumala News Today: తిరుమల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం. ఏఐ టెక్నాలజీతో భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీని ఆదేశించారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన సీఎం కుటుంబం.

AndhraPravasi News Desk 2 min read
Tirumala News Today: కాన్వాయ్ వదిలి భక్తుల చెంతకు.. తిరుమల  వీధుల్లో సామాన్యుడిలా సీఎం చంద్రబాబు..!!

AP CM Tirumala news: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పర్యటన సాగింది. అయితే, కేవలం విరామ దర్శనానికే పరిమితం కాకుండా, సామాన్య భక్తులతో కలిసి మెలిసి తిరుగుతూ సీఎం అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి, భక్తుల మధ్యలోకి వెళ్లి వారితో ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యమంత్రి  నడుచుకుంటూ వెళ్తుండగా భక్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సెక్యూరిటీని సైతం వారించి, నేరుగా భక్తుల వద్దకు వెళ్లి  లడ్డూ ప్రసాదం రుచి, నాణ్యత ఎలా ఉందంటూ భక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం చాలా బాగుందని భక్తులు చెప్పగా, దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన సీఎం, త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుని భక్తులకు మరింత వేగంగా దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

భక్తుల భద్రత  సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా 'ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్' వ్యవస్థను ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఈ వ్యవస్థ నిరంతరం నిఘా ఉంచుతుందని ఆయన వివరించారు. ఇదే క్రమంలో దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆలయం నుంచి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కాలినడకన వెళ్లారు. దారి పొడవునా భక్తులు దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుండగా, సీఎం వారితో ఫోటోలు దిగారు.

అన్నప్రసాద కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్  దేవాన్ష్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. సామాన్య భక్తులతో కలిసి ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేశారు. దేవాన్ష్ పుట్టినరోజు కానుకగా ఒకరోజు అన్నదాన వితరణకు అయ్యే ఖర్చును విరాళంగా అందజేశారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి వడ్డించడంతో భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఈ పర్యటన అంతా ఒక ముఖ్యమంత్రి పర్యటనలా కాకుండా, ఒక సామాన్య భక్తుడు తన కుటుంబంతో కలిసి వచ్చినట్లుగా సాగడం విశేషం. భక్తులతో మమేకమవడం, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవడం చంద్రబాబు ప్రత్యేకతను చాటిచెప్పింది. టీటీడీలో రాబోయే కాలంలో సాంకేతిక మార్పులు భక్తులకు మరింత ఊరటనిస్తాయని ఈ సందర్భంగా స్పష్టమైంది.

Be the first to react

More Coverage

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…

IRCTC: నకిలీ టికెట్ బుకింగ్‌లపై ఐఆర్‌సీటీసీ ఉక్కుపాదం.. 3 కోట్లకు పైగా అనుమానాస్పద ఖాతాలు డీయాక్టివేట్!

IRCTC: నకిలీ టికెట్ బుకింగ్‌లపై ఐఆర్‌సీటీసీ ఉక్కుపాదం.. 3 కోట్లకు పైగా అనుమానాస్పద ఖాతాలు డీయాక్టివేట్!

IRCTC: రైలు టికెట్లు పొందడంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నకిలీ బుకింగ్‌లపై వస్తున్న ఫిర్యా…