LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

NTR District: ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్‍కు కొరత లేదు.. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా!

NTR District: ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

AndhraPravasi News Desk 1 min read
NTR District: ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్‍కు కొరత లేదు.. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా!

ఒకేసారి ఫుల్ ట్యాంకులు చేయించడం వల్ల నోస్టాకు బోర్డు పెడుతున్నారు..

కొండపల్లి పెట్రోల్, డీజిల్ సరఫరా కంపెనీలతో మాట్లాడాం..

ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారాలు పూర్తిగా అసత్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ రూమర్లను నమ్మి చాలా మంది అవసరం లేకపోయినా పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి ఫుల్ ట్యాంక్‌లు చేయించుకుంటున్నారని చెప్పారు. దీంతో కొన్ని బంకుల వద్ద తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందని వివరించారు.

కొండపల్లి ప్రాంతంలోని పెట్రోల్, డీజిల్ సరఫరా కంపెనీలతో ఇప్పటికే మాట్లాడినట్లు, సాధారణంగా వచ్చే సరఫరా కంటే 20 శాతం అదనంగా ఇంధనం జిల్లాకు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ వ్యవహారాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు వెల్లడించారు. అయితే కమర్షియల్ డీజిల్ కొనుగోలు చేసేవారు కూడా రిటైల్ బంకులకు రావడం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతోందని తెలిపారు.

ప్రజలు క్యూలైన్ల ప్రకారం వెళ్లి తమ వంతు వచ్చినప్పుడు మాత్రమే పెట్రోల్, డీజిల్ తీసుకోవాలని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు, ఎప్పటికప్పుడు తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు.

వ్యవసాయం, ఆక్వా రంగం, ఆస్పత్రులు, అంబులెన్సులకు ఇంధన సరఫరాలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని జేసీ తెలిపారు. ఎవరైనా సమస్యలు ఎదురైతే ఎన్టీఆర్ జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70545 కు కాల్ చేయాలని సూచించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా సహకరిస్తే ఇలాంటి పరిస్థితులను సులభంగా ఎదుర్కోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…