LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

Ramayapatnam: రామాయపట్నం పోర్టు అభివృద్ధి వేగవంతం.. రైలు మార్గం నిర్మాణం!

Ramayapatnam: ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకంగా మారనున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే పోర్టు కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

AndhraPravasi News Desk 1 min read
Ramayapatnam: రామాయపట్నం పోర్టు అభివృద్ధి వేగవంతం.. రైలు మార్గం నిర్మాణం!

రామాయపట్నం పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు..

మొత్తం 7.2 కిలోమీటర్ల మేర రైలు మార్గం..

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకంగా మారనున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే పోర్టు కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో పోర్టుకు అనుసంధానంగా రైలుమార్గం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మొత్తం 7.2 కిలోమీటర్ల మేర నేరుగా పోర్టుకు కలుపుతూ ఈ రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు సరుకు రవాణా వేగవంతం కావడానికి ఈ మార్గం కీలకంగా మారనుంది.

ఈ ఏడాదిలోనే రైలుమార్గ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పోర్టు పనులతో సమాంతరంగా రైల్వే కనెక్టివిటీ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోర్టుకు రైలుమార్గం నిర్మాణంపై ఇప్పటికే మంత్రుల ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చ జరిగింది. పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు.

ప్రత్యేకంగా స్థల సేకరణ, నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతో పనులు వేగవంతమయ్యాయి. రామాయపట్నం పోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, పరిశ్రమలకు కూడా ఇది కీలక కేంద్రంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…