⚡ BREAKING
Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ కొత్త రూల్స్ ఇవే! ఆ 6 కండిషన్స్ ఉంటేనే - ఈ నెల 22నే.. ఎవరెవరు అర్హులో తెలుసుకోండి!  •  Gorantla Butchaiah: అంత్యక్రియల వేళ ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఆంబోతులా రంకెలు! కన్నబిడ్డను తండ్రి చివరి చూపుకు దూరం!  •  first hydrogen train: పర్యాటకులకు గుడ్ న్యూస్.. 8 చారిత్రక రూట్ల రూపురేఖలు మార్చనున్న రైల్వే! రేపే భారత రైల్వే హిస్టరీలో..  • 

AP High Court: ఏపీ న్యాయవ్యవస్థలో కీలక పరిణామం.. హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు!

AP High Court: ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించేందుకు మార్గం సుగమమైంది.

AP High Court: ఏపీ న్యాయవ్యవస్థలో కీలక పరిణామం.. హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు!

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు..

కొలీజియం సిఫార్సులను కేంద్ర న్యాయశాఖకు పంపిన సుప్రీంకోర్టు..

ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించేందుకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ముగ్గురు జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం ప్రకారం సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సీ.హెచ్. పురుషోత్తమ కుమార్‌లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమించనున్నారు. వీరు ప్రస్తుతం జ్యుడిషియల్ అధికారులుగా సేవలందిస్తూ న్యాయరంగంలో మంచి అనుభవం సంపాదించారు. వారి సేవలను గుర్తించిన కొలీజియం ఈ పదోన్నతిని సిఫార్సు చేసింది.

కొలీజియం చేసిన ఈ సిఫార్సులను కేంద్ర న్యాయశాఖకు పంపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, వీరి నియామక ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో పాటు కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ నియామకాలు న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

Be the first to react

Latest