LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

AP High Court: ఏపీ న్యాయవ్యవస్థలో కీలక పరిణామం.. హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు!

AP High Court: ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించేందుకు మార్గం సుగమమైంది.

AndhraPravasi News Desk 1 min read
AP High Court: ఏపీ న్యాయవ్యవస్థలో కీలక పరిణామం.. హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు!

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు..

కొలీజియం సిఫార్సులను కేంద్ర న్యాయశాఖకు పంపిన సుప్రీంకోర్టు..

ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించేందుకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ముగ్గురు జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం ప్రకారం సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సీ.హెచ్. పురుషోత్తమ కుమార్‌లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమించనున్నారు. వీరు ప్రస్తుతం జ్యుడిషియల్ అధికారులుగా సేవలందిస్తూ న్యాయరంగంలో మంచి అనుభవం సంపాదించారు. వారి సేవలను గుర్తించిన కొలీజియం ఈ పదోన్నతిని సిఫార్సు చేసింది.

కొలీజియం చేసిన ఈ సిఫార్సులను కేంద్ర న్యాయశాఖకు పంపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, వీరి నియామక ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో పాటు కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ నియామకాలు న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…