LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

NDMA: దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్‌స్ లో రేపు అలర్ట్ సైరన్.. NDMA కీలక సూచనలు!

NDMA: దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లలో రేపు ఒక ప్రత్యేక అలర్ట్ సైరన్ వినిపించనుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడానికి రూపొందించిన ఈ వ్యవస్థను పరీక్షించే భాగంగా ఈ ట్రయల్ నిర్వహించనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
NDMA: దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్‌స్ లో రేపు అలర్ట్ సైరన్.. NDMA కీలక సూచనలు!

ప్రమాద సమయాల్లో ప్రజలను అలర్ట్ చేసే సైరన్..

భూకంపాలు, యుద్ధ సమయాల్లో అలర్ట్ చేసే ప్రయత్నం..

దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లలో రేపు ఒక ప్రత్యేక అలర్ట్ సైరన్ వినిపించనుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడానికి రూపొందించిన ఈ వ్యవస్థను పరీక్షించే భాగంగా ఈ ట్రయల్ నిర్వహించనున్నారు.

ఈ అలర్ట్ సిస్టమ్ ద్వారా భూకంపాలు, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు వంటి అత్యవసర సమయాల్లో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నప్పుడు మొబైల్‌లలో సైరన్ మోగుతూ, హెచ్చరిక సందేశం కూడా కనిపించేలా ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు.

ఈ ట్రయల్‌ను నేషనల్ డిజాష్టర్ మ్యానేజ్మెంట్ అథారిటీ (NDMA) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. భవిష్యత్తులో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రజలు వేగంగా స్పందించేలా ఈ వ్యవస్థ ఎంతవరకు ఉపయోగపడుతుందో పరీక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం.

అయితే, ఈ సైరన్ కేవలం ట్రయల్ మాత్రమేనని, ప్రజలు ఎలాంటి భయానికి గురికావాల్సిన అవసరం లేదని NDMA స్పష్టం చేసింది. మొబైల్‌లో అలర్ట్ వినిపించినా ఆందోళన చెందకుండా, ఇది పరీక్షలో భాగమని గుర్తించాలని సూచించింది.

ఈ కార్యక్రమం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతను మరింత మెరుగుపర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…