మొన్నే దర్శకుడిగా ఫస్ట్ సినిమా అనౌన్స్.. లిఫ్ట్ లో ఇరుక్కొని నాలుగున్నరేళ్ల కొడుకు మరణం! పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ! Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..! Sydney News: బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకపై దాడి.. 15 మంది మృతి! మొన్నే దర్శకుడిగా ఫస్ట్ సినిమా అనౌన్స్.. లిఫ్ట్ లో ఇరుక్కొని నాలుగున్నరేళ్ల కొడుకు మరణం! పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ! Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..! Sydney News: బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకపై దాడి.. 15 మంది మృతి!

Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు!

2025-12-13 11:05:00
Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల..

ఈ రోజుల్లో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో తప్పనిసరి పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, రేషన్, పెన్షన్ వంటి సేవలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి అయింది. అయితే వృద్ధులు, మంచానికే పరిమితమైన అనారోగ్య బాధితులు, దివ్యాంగులు ఆధార్ కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ‘ఇంటి వద్దే ఆధార్ సేవలు’ అందించే విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆధార్ అప్‌డేట్ కోసం ఇబ్బంది పడుతున్న వేలాది మందికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.

Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్!

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ సేవ ఎంత ఉపయోగకరమో చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు మంచానికే పరిమితమై ఉండగా, ఆమె వేలిముద్రలను అప్‌డేట్ చేసేందుకు UIDAI సిబ్బంది నేరుగా ఆమె ఇంటికే వెళ్లి సేవలు అందించారు. అలాగే విజయవాడలో మతిస్థిమితం లేని ఓ యువకుడి ఆధార్ అప్‌డేట్ కోసం కూడా అధికారులు ఇంటికే వెళ్లి ప్రక్రియను పూర్తి చేశారు. ఇలాంటి ఉదాహరణలు ‘ఇంటి వద్ద ఆధార్’ సేవ ఎంత అవసరమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సమాజంలోని బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న మానవతా దృక్పథానికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్!

ఈ ‘ఇంటి వద్ద ఆధార్’ సేవలు అందరికీ కాకుండా, ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికే పరిమితం చేస్తారు. ఇందులో వృద్ధులు, మంచానికే పరిమితమైన వ్యక్తులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులు అర్హులు. ఆధార్ కేంద్రానికి వెళ్లడం అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నవారే ఈ సేవలను పొందగలరు. దీనివల్ల నిజంగా అవసరం ఉన్నవారికే సేవలు అందేలా UIDAI మార్గదర్శకాలు రూపొందించింది. ఈ విధానం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.

GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!!

ఇంటి వద్దే ఆధార్ సేవలు పొందాలంటే ముందుగా కుటుంబ సభ్యులు సంబంధిత ప్రాంతీయ UIDAI కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వయసు, ఆధార్ అప్‌డేట్ అవసరం ఎందుకు అనే వివరాలతో ఒక లేఖ సమర్పించాలి. దీనికి తోడు ఆ వ్యక్తి ఫోటో, వైద్యులు జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్, మరో గుర్తింపు కార్డు జిరాక్స్‌ను జతచేయాలి. ఈ డాక్యుమెంట్లను UIDAI సిబ్బంది పరిశీలించిన తర్వాత సుమారు 7 రోజుల్లో ఇంటికే వచ్చి ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ సేవకు దూరంతో సంబంధం లేకుండా సుమారు రూ.700 వరకు ఫీజు వసూలు చేస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఉన్న UIDAI ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు!
Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్!
GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్!
AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!
US-China Relations: విభేదాలు మాటల్లోనే… కానీ చైనాకు అవసరం అయితే అమెరికానే భరోసా!
Sports City: ఏపీలో స్పోర్ట్స్ సిటీకి గ్రీన్ సిగ్నల్! 28 ఎకరాలు కేటాయింపు.. ఆ జిల్లా దశ తిరిగినట్లే!

Spotlight

Read More →