ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ.. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ! Bhagavad Gita: కర్తవ్యం తెలుసుకొని చేయడమే నిజమైన యోగం.. గీతామాత ఉపదేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -57! గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ.. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ! Bhagavad Gita: కర్తవ్యం తెలుసుకొని చేయడమే నిజమైన యోగం.. గీతామాత ఉపదేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -57! గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా!

Andesri: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అందెశ్రీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి గీతం!

2025-11-10 17:37:00
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం!

తెలంగాణ సాహితీ లోకాన్ని శోకసంద్రంలో ముంచెత్తుతూ ప్రజాకవి డా. అందెశ్రీ ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణాన్ని అభిమానులు, సాహితీవేత్తలు, రాజకీయ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మరణానికి గంటల ముందు వరకూ ఆయన సజావుగానే ఉన్నారనే విషయం మరింత బాధను కలిగిస్తోంది. నిన్న సమాచార హక్కు కమిషనర్ అయోధ్య రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప పూజ కార్యక్రమానికి హాజరైన అందెశ్రీ పూజలో పాల్గొని, అక్కడ ఉన్నవారితో కాసేపు ముచ్చటించారు.

AIతో మరీ వినయంగా కాకుండా ధైర్యంగా మాట్లాడితే మంచి సమాధానాలు — తాజా అధ్యయనం ఆసక్తికరం!!

రాత్రి ఇంటికి చేరుకుని, భోజనం చేసి, ఎలాంటి అస్వస్థత లేకుండా నిద్రపోయారని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఉదయం నిద్రపట్టిన ఆయనను లేపే ప్రయత్నంలో స్పందించకపోవడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

అమ్మ చేతి రుచిని గుర్తుచేసే వెల్లుల్లి పప్పుల పొడి! ప్రతి వంటింటి ప్రత్యేక వంటకం!

తెలంగాణ గర్వకారణమైన ప్రజాగీతం జయ జయ హే తెలంగాణ…ను ప్రపంచానికి వినిపించి రాష్ట్ర భావజాలాన్ని అద్భుతంగా వ్యక్తీకరించిన అందెశ్రీ మరణంతో లక్షలాది మంది అభిమానులు వేదన చెందుతున్నారు. ఉద్యమ కాలంలో ఆయన రచించిన పాటలు ప్రజలను జాగృతం చేశాయి. “పల్లె నీకు వందనాలమ్మో”, “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు”, “జనజాతరలో మన గీతం” వంటి ఎన్నో ప్రజాస్వామ్య గీతాలు నేటికీ పలువురి హృదయాల్లో నిలిచిపోయాయి. సామాజిక చైతన్యం, ఉద్యమ స్పూర్తి, మానవ విలువలు… ఇవన్నింటినీ ఒక్కొక్క పదంలో నిలబెట్టగల కవి అందెశ్రీ. ఆయన ఆ పదజాలం ఇక వినిపించదనే ఆలోచన సాహితీ ప్రియులను కేదరింపజేస్తోంది.

Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు!

ప్రజాకవిగా పేరుపొందిన అందెశ్రీ తెలుగు సాహిత్యంలో తన సొంత ముద్ర వేసుకున్నారు. ఆయన రచనలు గ్రామీణ జీవన విధానాన్ని, సామాజిక సమస్యలను, మనిషి అంతర్మనస్సు పోరాటాలను ప్రతిబింబిస్తూ వచ్చాయి. ఉద్యమ గీతకారుడిగానే కాకుండా, ఆధునిక కవిత్వానికి ఆయన ఇచ్చిన సేవ కూడా అమోఘం. భావాన్ని నేరుగా హృదయానికి చేరేలా చెప్పగలిగిన అరుదైన సామర్థ్యం అందెశ్రీకి ఉంది. అందుకే ఆయన కవితలు, పాటలు కేవలం సాహిత్యం మాత్రమే కాదు  ప్రజల హృదయాల గుండెకాయ.

Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..!

అందెశ్రీ మరణంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “తెలుగు సాహితీ ప్రపంచం ఒక గొప్ప కవిని కోల్పోయింది. తెలంగాణకు రాష్ట్ర గీతం అందించిన అందెశ్రీ మరణం తీరని లోటు” అని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సహా పలువురు నేతలు ఆయన మరణంపై విచారం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.

'దృశ్యం' సినిమా స్ఫూర్తితో ఘాతుకం: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసిన కిరాతక భర్త!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాహితీవేత్తలు, రచయితలు, సామాన్య ప్రజలు అందెశ్రీను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో అనేక సందేశాలు పెడుతున్నారు. ఆయన రచనలు శాశ్వతం, ఆయన స్వరం నిత్యం ప్రజలలో జీవించిపోతుందని అభిమానులు అంటున్నారు. తన జీవితాంతం ప్రజల కోసం, భాష కోసం, తెలంగాణ గౌరవం కోసం కలం పట్టిన అందెశ్రీ…
ఇక సెలవంటూ దివికేగారు.

WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ!
LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!!
Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి!
చెన్నైలో హైటెన్షన్.. నటి త్రిష ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు - నాలుగోసారి కలకలం.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్!
Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..!
మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక!

Spotlight

Read More →