LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Health

Junk Food Health Risks: మీరు తినే ఫాస్ట్ ఫుడ్ క్యాలరీలు కరగాలంటే ఏ వ్యాయామం చేయాలో తెలుసా?

Junk Food Health Risks: మనం రోజూ తినే సమోసా, పానీపూరీ, పిజ్జా వంటి జంక్ ఫుడ్స్ వల్ల శరీరంలో చేరే క్యాలరీలను కరిగించాలంటే ఎంతసేపు వ్యాయామం చేయాలో తెలుసుకోండి

AndhraPravasi News Desk 2 min read
Junk Food Health Risks: మీరు తినే ఫాస్ట్ ఫుడ్ క్యాలరీలు కరగాలంటే ఏ వ్యాయామం చేయాలో తెలుసా?

Junk Food Health Risks: సాయంత్రం అయిందంటే చాలు.. వేడివేడి సమోసాలు, ఘుమఘుమలాడే పానీపూరీలపై మన మనసు లాగుతుంది. ఆ రుచికి ఫిదా అయిపోయి ప్లేట్ల మీద ప్లేట్లు లాగించేస్తుంటాం. కానీ, ఆ కాసేపటి రుచి వెనుక మన ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం తినే ఒక్క చిన్న సమోసా వల్ల వచ్చే క్యాలరీలను కరిగించాలంటే కనీసం నాలుగు కిలోమీటర్లు నడవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ అనేది ఇప్పుడు ఒక వ్యసనంలా మారిపోతోందని, ఇది పొగాకు వాడకం కంటే ప్రమాదకరమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

చాలామందికి జంక్ ఫుడ్ తినడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా వీటిని తయారు చేస్తారు. ముఖ్యంగా బర్గర్లు, పిజ్జాలు, చిప్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు మన మెదడుపై ప్రభావం చూపుతాయని హెల్సింకి యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కేవలం బరువు పెరగడమే కాకుండా.. గుండె జబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు  అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

మనం రోజూ సరదాగా తినే చిరుతిళ్లు కరగాలంటే ఎంత శ్రమించాలో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక 50 గ్రాముల ఆలూ చిప్స్ ప్యాకెట్ తింటే, ఆ క్యాలరీలను కరిగించడానికి 40 నిమిషాల పాటు వేగంగా నడవాలి. అలాగే, ఒక గ్లాసు కూల్ డ్రింక్ తాగితే 20 నిమిషాలు ఈత కొట్టాలి. అందరికీ ఇష్టమైన పానీపూరీ కేవలం ఆరు తిన్నా సరే.. అర గంట పాటు బ్రిస్క్ వాక్ చేయాల్సిందే. మీరు ఒక ప్లేట్ నూడుల్స్ గానీ, మంచూరియా గానీ తిన్నట్లయితే, ఆ ఎనర్జీని ఖర్చు చేయడానికి గంటన్నర పాటు రన్నింగ్ చేయాలి.

ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలు చిన్నప్పటి నుంచే చాక్లెట్లు, కేకులు, ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడుతున్నారు. సంప్రదాయబద్ధంగా ఇంట్లో వండుకునే ఆహారాన్ని కాదని, బయట దొరికే రంగురంగుల ప్యాకెట్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారి ఎదుగుదల దెబ్బతింటోంది. కాబట్టి, పిల్లలకు పండ్లు, కూరగాయలు మరియు పౌష్టికాహారం అలవాటు చేయడం ఎంతో అవసరం.

 నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయడం ఒక మార్గం అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నప్పుడు ఆ క్యాలరీలను కరిగించేలా వ్యాయామం చేయడం రెండో మార్గం. ఈ రెండూ చేయకపోతే మాత్రం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వల్ల చనిపోయే వారి కంటే,  ఆహారపు అలవాట్ల వల్ల మరణించే వారి సంఖ్య కోటికి పైగా ఉండటం గమనార్హం. కాబట్టి, రుచి కోసం రోగాన్ని ఆహ్వానించకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుందాం.

Be the first to react

More Coverage