LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Health

Wisdom tooth pain symptoms: జ్ఞానదంతాల సమస్య: పన్ను ఎప్పుడు తీయించాలి? జాగ్రత్తలు ఇవే!

Wisdom tooth pain symptoms: జ్ఞానదంతం తీయిస్తే కంటి చూపు మందగిస్తుందని భయపడుతున్నారా? పంటి నరాలకు, కంటి నాడులకు మధ్య సంబంధం ఉందా? జ్ఞానదంతాల నొప్పి ఎందుకు వస్తుంది చికిత్స ఎప్పుడు అవసరమో వివరంగా తెలుసుకోండి..

AndhraPravasi News Desk 2 min read
Wisdom tooth pain symptoms: జ్ఞానదంతాల సమస్య: పన్ను ఎప్పుడు తీయించాలి? జాగ్రత్తలు ఇవే!

Wisdom tooth pain symptoms: మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 28 పళ్లే ఉంటాయి. కానీ 20 ఏళ్లు దాటాక దవడ చివర్లో కొత్తగా రెండు జతల పళ్లు రావడం మొదలవుతాయి. వీటినే మనం 'జ్ఞానదంతాలు' అంటాం. పాత కాలంలో మన పూర్వీకులు గట్టి గింజలు, పచ్చి మాంసం తినేవారు కాబట్టి వాళ్లకు ఈ పళ్లు బాగా వాడేవారు. కానీ ఇప్పుడు మనం అన్నీ ఉడికించిన మెత్తటి పదార్థాలే తింటున్నాం. దీనివల్ల మన దవడ సైజు తగ్గిపోయింది. ఆ పళ్లు రావడానికి లోపల తగినంత చోటు లేక పక్క పళ్లను తోయడం, చిగుళ్లను చీల్చడం వల్ల విపరీతమైన నొప్పి పుడుతుంది.

చాలామందికి ఒక పెద్ద భయం ఉంది. పన్ను తీయిస్తే కళ్లు పోతాయని, చూపు మందగిస్తుందని అనుకుంటారు. ముఖ్యంగా పెద్దవాళ్లు "కంటి నరాలు దెబ్బతింటాయి జాగ్రత్త అని భయపెడుతుంటారు. కానీ ఇది ముమ్మాటికీ అపోహ మాత్రమే. మన దంతాలకు ఉండే నరాలు వేరు, కంటికి ఉండే నరాలు వేరు. కంటి చూపును కంట్రోల్ చేసే నరాలు మెదడు నుంచి నేరుగా కళ్లకు వెళ్తాయి. వాటికి ఈ దవడ పళ్లతో ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి జ్ఞానదంతం తీయించుకోవడం వల్ల చూపు తగ్గుతుందనే మాటలో అస్సలు నిజం లేదు.

కొందరికి ఈ పన్ను తిన్నగా రాకుండా పక్కకు వంగి వస్తుంది. దీనివల్ల పక్కన ఉన్న మంచి పన్ను పాడైపోతుంది. అంతేకాదు, ఆ సందులో అన్నం ముక్కలు ఇరుక్కుపోయి కుళ్లిపోయి నోరు వాసన రావడం, ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు పన్ను వస్తున్నప్పుడు భరించలేని నొప్పి ఉన్నా, దవడ వాపు వచ్చినా వెంటనే డెంటిస్ట్ దగ్గరకు వెళ్లడం మంచిది. దాన్ని అలాగే వదిలేస్తే పక్కన ఉన్న పళ్లు కూడా పుచ్చిపోయి ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది.

ఇప్పుడున్న రోజుల్లో పన్ను తీయడం అనేది చాలా చిన్న విషయం. డాక్టర్లు ఆ పంటి దగ్గర ఇంజక్షన్ ఇచ్చి మొద్దుబారేలా చేస్తారు. కాబట్టి మీకు నొప్పి అస్సలు తెలియదు. ఒక పది నిమిషాల్లో ఆ పన్ను తీసేయొచ్చు. ఆ తర్వాత రెండు రోజులు డాక్టర్ చెప్పినట్టు మందులు వేసుకుంటే చాలు, తగ్గిపోతుంది. దీనివల్ల మెదడుకు గానీ, కళ్లకు గానీ ఎటువంటి ప్రమాదం జరగదు. ఇది పూర్తిగా సురక్షితమైన పద్ధతి.

చివరగా చెప్పేదేంటంటే, ఎవరో చెప్పిన మాటలు విని అనవసరంగా భయపడకండి. పన్ను నొప్పిని భరిస్తూ కూర్చుంటే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. డాక్టర్లు ఎక్స్-రే తీసి ఆ పన్ను అవసరమో లేదో చెప్తారు. ఒకవేళ తీయాల్సి వచ్చినా ధైర్యంగా తీయించుకోవచ్చు. దంతాల ఆరోగ్యం బాగుంటేనే మనం హాయిగా తిని, నవ్వుతూ ఉండగలం. కాబట్టి అనవసరపు పుకార్లను పక్కన పెట్టేయండి.

Be the first to react

More Coverage