Trump: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక సమావేశం.. తుది నిర్ణయం? Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి.. Hormuz: హర్మూజ్ జలసంధి దాటి భారత్‌కు వస్తోన్న చమురు నౌక.. ఉపశమనం పొందనున్న ఇంధన రంగం! USA: శాంతి చర్చల మధ్య మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు! UAE: బక్రీద్ సందర్భంగా వేలాది ఖైదీలకు యూఏఈ క్షమాభిక్ష! Hormuz: హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు! Iran War: మరికొన్ని గంటల్లోనే ప్రపంచానికి శుభవార్త.. ఢిల్లీ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు! USA-Iran: అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన.. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలు! Qatar Telugu Diaspora: ఖతార్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు... ప్రవాస భారతీయుల ఘన సన్మానం! Gulf Updates: కల్తీ కల్లు వ్యసనం.. దుబాయ్‌లో వికటించిన వైనం డిచుపల్లి వాసి గంగాధర్ కోసం ఎన్నారై సెల్ ప్రత్యేక చొరవ! Trump: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక సమావేశం.. తుది నిర్ణయం? Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి.. Hormuz: హర్మూజ్ జలసంధి దాటి భారత్‌కు వస్తోన్న చమురు నౌక.. ఉపశమనం పొందనున్న ఇంధన రంగం! USA: శాంతి చర్చల మధ్య మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు! UAE: బక్రీద్ సందర్భంగా వేలాది ఖైదీలకు యూఏఈ క్షమాభిక్ష! Hormuz: హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు! Iran War: మరికొన్ని గంటల్లోనే ప్రపంచానికి శుభవార్త.. ఢిల్లీ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు! USA-Iran: అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన.. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలు! Qatar Telugu Diaspora: ఖతార్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు... ప్రవాస భారతీయుల ఘన సన్మానం! Gulf Updates: కల్తీ కల్లు వ్యసనం.. దుబాయ్‌లో వికటించిన వైనం డిచుపల్లి వాసి గంగాధర్ కోసం ఎన్నారై సెల్ ప్రత్యేక చొరవ!

Trump: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక సమావేశం.. తుది నిర్ణయం?

Trump: అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో అత్యవసర సమావేశం నిర్వహించినప్పటికీ, ఎలాంటి తుది నిర్ణయం లేకుండానే సమావేశం ముగిసింది.

Published : 2026-05-30 12:22:00

అమెరికా-ఇరాన్ చర్చలు కొనసాగుతున్నా.. ఉద్రిక్తతలకు ముగింపు లేదు..

హోర్ముజ్ జలసంధి వివాదంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు..

అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో అత్యవసర సమావేశం నిర్వహించినప్పటికీ, ఎలాంటి తుది నిర్ణయం లేకుండానే సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సిట్యుయేషన్ రూమ్ సమావేశంలో కాల్పుల విరమణ, అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.

సమావేశం అనంతరం వైట్ హౌస్ అధికారులు స్పందిస్తూ, అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే ఒప్పందానికే అధ్యక్షుడు ట్రంప్ అంగీకరిస్తారని తెలిపారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదన్నది అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే ఇరాన్‌కు సంబంధించిన ఫ్రీజ్ చేసిన నిధుల విడుదల వంటి అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.

సమావేశానికి ముందు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్‌ను తొలగిస్తుందని, అమెరికా నౌకాదళ నిర్బంధాన్ని ఎత్తివేస్తుందని పేర్కొన్నారు. దీంతో నౌకల రాకపోకలు మళ్లీ ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని గుర్తించి ధ్వంసం చేస్తామని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌కు ఎలాంటి డబ్బు విడుదల చేయబోమని కూడా ట్రంప్ స్పష్టం చేశారు.

ఇక ఇరాన్ మాత్రం ఇప్పటివరకు అమెరికాతో ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ప్రస్తుతం తమ ప్రధాన దృష్టి యుద్ధం ముగియడంపైనే ఉందన్నారు. యురేనియం శుద్ధి లేదా అణు నిల్వలపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. హోర్ముజ్ జలసంధి నిర్వహణ అంశం పూర్తిగా ఇరాన్, ఒమాన్ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇరాన్ నేతలు అమెరికాపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత కమిటీ అధినేత ఇబ్రహీం అజీజీ మాట్లాడుతూ, “ఏదైనా ఒప్పందం ఉంటే పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ ప్రధాన చర్చాకర్త మహమ్మద్ బాఘర్ ఘలిబాఫ్ మాట్లాడుతూ, “మాటల కంటే క్షిపణుల ద్వారానే మేము ఫలితాలు సాధిస్తాం” అని వ్యాఖ్యానించడం ఉద్రిక్తతను మరింత పెంచింది.

ఈ చర్చల్లో ప్రధానంగా ఐదు కీలక అంశాలు ప్రాధాన్యత పొందుతున్నాయి. మొదటిది ఇరాన్ అణు నిల్వలు. ఇరాన్ వద్ద ప్రస్తుతం 60 శాతం శుద్ధి చేసిన సుమారు 440 కిలోల యురేనియం ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. దీన్ని ఇతర దేశానికి అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. రెండో అంశం హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గం ద్వారా సుమారు 20 శాతం చమురు రవాణా జరుగుతుంది.

మూడో అంశంగా ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణను ఒప్పందంలో చేర్చాలని ఇరాన్ కోరుతోంది. నాలుగోది విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధుల విడుదల. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం సుమారు 24 బిలియన్ డాలర్ల విడుదలను ఇరాన్ కోరుతోంది. చివరిది అమెరికా నుంచి హామీలు. గతంలో 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన నేపథ్యంలో, ఈసారి కేవలం మాటలు కాకుండా స్పష్టమైన హామీలు కావాలని ఇరాన్ పట్టుబడుతోంది.

ఇటీవల ఏప్రిల్ 8న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ, పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా, ఇరాన్ పరస్పరం ఒకరిపై ఒకరు కాల్పుల విరమణ ఉల్లంఘన ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగడంతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ చమురు మార్కెట్లపై, మధ్యప్రాచ్య భద్రతపై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

Spotlight

Read More →