Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!! Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!!

SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!!

SAPChairman: రాష్ట్రంలో జరుగుతున్న క్రీడా పోటీలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై శాప్ (SAP) ఛైర్మన్ రవినాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రీడలు అనేవి పార్టీలకు అతీతంగా ఉండాలని, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే క్రీడాకారులకు మరింత ఉత్సాహం వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Published : 2026-02-27 15:34:00

క్రీడాకారులను ఉత్సాహపరచడంలో వైసీపీ విఫలం…

పార్టీలకతీతంగా ఆడుదాం రండి…

రాజకీయాల కోసమే క్రీడలకు దూరం ఉంటున్నారా?

SAPChairman: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం నిర్వహించిన రెండో విడత ఆట విడుపు క్రీడలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, ఈ పోటీల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శాప్ ఆధ్వర్యంలో ఈ క్రీడలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని, ఇది కేవలం ఆట మాత్రమే కాదని, రాష్ట్ర యువతకు ఒక గొప్ప సందేశాన్ని పంపే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న ఈ పోటీలు, 2025 కన్నా ఈ ఏడాది మరింత ఉత్సాహంగా సాగడం విశేషమని కొనియాడారు.
మైదానంలోకి దిగిన ప్రజాప్రతినిధులు వృత్తిపరమైన క్రీడాకారులను తలపించారని రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కబడ్డీ వంటి శారీరక శ్రమతో కూడిన ఆటల్లో పలువురు ఎమ్మెల్యేలు గాయపడినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా పట్టుదలతో ఆడటం వారి క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతోందన్నారు. 70 ఏళ్ల వయసులో కూడా బుచ్చయ్య చౌదరి గారు పరుగు పందెంలో ఉత్సాహంగా పాల్గొనడం, కామినేని శ్రీనివాసరావు గారు కబడ్డీలో విజేతగా నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచాయని తెలిపారు. గెలుపోటముల కంటే, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం క్రీడలు ఎంత అవసరమో వీరంతా నిరూపించారని, ఇది నేటి తరం తల్లిదండ్రులకు, యువతకు ఒక గొప్ప స్ఫూర్తి అని ఆయన అభివర్ణించారు.

రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ పోటీల్లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొనడాన్ని ఆయన స్వాగతించారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వారి టీమ్ కూడా ఈ పోటీలకు వచ్చి ఉంటే ప్రజలకు మరింత సానుకూల సందేశం వెళ్లేదని అభిప్రాయపడ్డారు. కేవలం మాటలతో కాకుండా, మైదానంలోకి వచ్చి ఆడి చూపించడం ద్వారా కూటమి ప్రభుత్వ సభ్యులు క్రీడల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్పారు. ఇదే ఉత్సాహంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కూడా పోటీలు నిర్వహిస్తూ, గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారని రవి నాయుడు వెల్లడించారు.

ఇక క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. అది భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే 'దాయాదుల పోరు'ను తలపించిందని చైర్మన్ చమత్కరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ టీమ్  అచ్చెన్నాయుడు టీమ్‌ల మధ్య జరిగిన పోరులో నాదెండ్ల టీమ్ వరుసగా రెండో ఏడాది కూడా విజేతగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మంత్రి సుభాష్, బొజ్జల సుధీర్ రెడ్డి, సుందరపు విజయ్ కుమార్ వంటి వారు ఆల్‌రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్నారని తెలిపారు. మొత్తం 13 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు త్వరలోనే బహుమతులు అందజేస్తామని ఆయన ప్రకటించారు.

రఘురామకృష్ణరాజు టీమ్ కబడ్డీ  టగ్ ఆఫ్ వార్‌లో అదరగొట్టగా, క్యారమ్స్‌లో మంత్రి సుభాష్, ఇతర క్రీడల్లో గద్దె రామ్మోహన్ విజేతలుగా నిలిచారని రవి నాయుడు వివరించారు. ఈ పోటీల కవరేజ్ ద్వారా క్రీడలను ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్రీడలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే శాప్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Spotlight

Read More →