Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!! Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!!

NaraLokesh: నేడు ముంబైలో.. రేపు ఉత్తరాంధ్రలో మంత్రి లోకేశ్ షెడ్యూల్ ఖరారు.!!

NaraLokesh: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బిజీ షెడ్యూల్ ఖరారైంది. ఈరోజు ఆయన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పర్యటించనున్నారు. అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లతో సమావేశమై ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. అనంతరం రేపు (శనివారం) ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లనున్న లోకేశ్, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ (AU) శతాబ్ది ఉత్సవాల సన్నాహకాలను సమీక్షించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Published : 2026-02-27 13:52:00

నేడు ముంబైలో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ…

వందేళ్ల వేడుకలపై వీసీతో కీలక సమీక్ష…

అభివృద్ధి పనులపై ప్రత్యేక ఫోకస్…

NaraLokesh: ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే  ముంబై పర్యటనకు బయలుదేరనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా  మంత్రి లోకేశ్ ఈ పర్యటన చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న తరుణంలో, మంత్రి లోకేశ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ముంబైలోని ప్రముఖ హోటల్ 'హయత్ రీజెన్సీ'లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్కడ దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తలు  ఇన్వెస్టర్లతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఉన్న వనరులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించి, కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ముంబై పర్యటన ముగించుకున్న అనంతరం, మంత్రి లోకేశ్ నేడు రాత్రికే విశాఖపట్నం చేరుకోనున్నారు. ఉత్తరాంధ్రలో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. రాత్రి విశాఖలో బస చేసి, రేపు ఉదయం నుండి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. మంత్రి రాకను పురస్కరించుకుని స్థానిక అధికారులు  కూటమి నాయకులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

రేపు  విశాఖపట్నం  అనకాపల్లి జిల్లాల్లో మంత్రి లోకేశ్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే, స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించి, అక్కడి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థల బలోపేతం  మౌలిక సదుపాయాల కల్పనపై  అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం  ఉండనుంది.

అమరావతి నుండి ముంబై, అక్కడి నుండి విశాఖ వరకు మంత్రి లోకేశ్ చేపట్టిన ఈ  పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఒకవైపు అసెంబ్లీలో చురుగ్గా పాల్గొంటూనే, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు. రేపు అనకాపల్లి పర్యటనలో మంత్రి ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారోనని స్థానిక ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

Spotlight

Read More →