విదేశాలకు వలస వెళ్లే భారతీయుల కోసం 1983 లో అమలులోకి వచ్చిన వలస చట్టానికి (ఎమిగ్రేషన్ యాక్టు) సమూల మార్పులు చేయడానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓవర్సీస్ మొబిలిటీ బిల్లు, 2025 ముసాయిదాను విడుదల చేసింది. ఈనెల 24 లోగా ఈ బిల్లుపై అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఆధ్వర్యంలో ఈ బిల్లుపై ఈనెల 20న హైదరాబాద్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు. హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ ప్రవాసులు తమ వీలునుబట్టి వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్ ద్వారా పాల్గొనవచ్చు.
మరింత సమాచారం కోసం, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి +91 96661 23419 స్వదేశ్ పరికిపండ్ల +91 94916 13129 సిస్టర్ లిజీ జోసెఫ్ +91 94416 75817 లను సంప్రదించవచ్చు.