Airport Alert: గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్… రెండు విమానాలు దారి మళ్లింపు! Fog blankets: తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు దుప్పటి… విమానాలు రద్దు, రహదారులపై ట్రాఫిక్ జామ్! Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం! Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! Airport Alert: గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్… రెండు విమానాలు దారి మళ్లింపు! Fog blankets: తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు దుప్పటి… విమానాలు రద్దు, రహదారులపై ట్రాఫిక్ జామ్! Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం! Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం!

IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం!

2025-12-15 14:02:00
కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ భేటీ! విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ..

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల చోటు చేసుకున్న తీవ్ర అంతరాయాలు, భారీగా విమానాల రద్దు అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ వ్యవహారం ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు పరిధిలో విచారణలో ఉన్నందున, అక్కడే తమ వాదనలు వినిపించాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను పరిశీలించి, ఒకే అంశంపై రెండు కోర్టుల్లో సమాంతర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం పేర్కొంది.

Andhra Pradesh Government: ప్రభుత్వ సేవలు ఇక మీ ఇంటి వద్దకే.. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసే సింపుల్ ప్రాసెస్ ఇదే!!!

ఈ పిల్‌ను న్యాయవాది నరేంద్ర మిశ్రా స్వయంగా దాఖలు చేశారు. ఇప్పటికే ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతోందని, అంతేకాకుండా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, ఒకే సమస్యపై రెండు వేదికల్లో విచారణ జరగడం సరైంది కాదని అభిప్రాయపడింది. అందువల్ల పిటిషనర్ తన వాదనలను ఢిల్లీ హైకోర్టులోనే కొనసాగించాలని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టు ఈ పిల్‌ను విచారణకు తీసుకోలేదు.

First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది!

పిటిషనర్ తన పిల్‌లో చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల ఇండిగో విమానాలు భారీ సంఖ్యలో రద్దు కావడం, పలు విమానాలు గంటల తరబడి ఆలస్యమవడంతో ప్రధాన విమానాశ్రయాల్లో ‘మానవతా సంక్షోభం’ నెలకొందని ఆయన పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు సహా వేలాది మంది ప్రయాణికులు ఆహారం, తాగునీరు, సరైన విశ్రాంతి వసతులు లేకుండా ఎయిర్‌పోర్ట్‌లలో పడిగాపులు కాయాల్సి వచ్చిందని పిల్‌లో వివరించారు. ఈ పరిస్థితి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 – జీవించే హక్కుకు భంగం కలిగించిందని ఆయన వాదించారు.

CIC: రాష్ట్రపతి చేతుల మీదుగా CICగా బాధ్యతలు.. 9 ఏళ్ల తర్వాత పూర్తి సామర్థ్యంతో పని చేయనున్న!

ఇదే అంశంపై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు, లక్షలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా పరిస్థితి ఎందుకు దిగజారిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 22కి వాయిదా వేసింది. మరోవైపు ఇండిగో సంస్థ తన వివరణలో, కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని తెలిపింది. ఈ నెల 12న మొత్తం 2,050 విమానాలు నడపగా, కేవలం రెండు విమానాలే రద్దయ్యాయని ప్రకటించింది. ప్రయాణికుల అసౌకర్యంపై క్షమాపణలు చెబుతూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఇండిగో పేర్కొంది.

న్యూ ఇయర్ 2026 ఆఫర్.. జియో కొత్త ప్లాన్లు విడుదల! యూజర్లకు పండగే - 18 నెలల జెమిని ప్రో ఉచితం!
ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త! రూ.2వేలు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం.. త్వరపడండి!
మాజీ భార్యకు షాక్.. సమంత రెండో పెళ్లి తర్వాత చైతూ నుంచి అదిరిపోయే 'బేబీ బంప్' ప్రకటన!
ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు..
WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు!
TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం!

Spotlight

Read More →