LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

NBK Lifetime Achievement Award: ఢిల్లీలో బాలయ్యకు అరుదైన గౌరవం: 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!

NBK Lifetime Achievement Award: నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తిస్తూ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ' (IFFD 2026)లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న బాలయ్య ఫోటోలు ఇప్పుడు వైర…

AndhraPravasi News Desk 2 min read
NBK Lifetime Achievement Award: ఢిల్లీలో బాలయ్యకు అరుదైన గౌరవం: 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!

NBK Lifetime Achievement Award: నందమూరి అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. టాలీవుడ్ సీనియర్ హీరో, 'నటసింహం' నందమూరి బాలకృష్ణకు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని 'భారత్ మండపం'లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ఆయనకు 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్'  అవార్డును ప్రధానం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డును అందుకున్నారు.

సినీ పరిశ్రమలో బాలకృష్ణ అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ గుర్తింపు లభించింది. తన తండ్రి, దివంగత లెజెండరీ నటుడు ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలయ్య, కేవలం నటుడిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల ఆయన ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ వేడుకలో బాలయ్యతో పాటు అలనాటి మేటి నటి షర్మిలా ఠాగూర్‌ను కూడా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

బాలకృష్ణ కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, ప్రజా సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా వేలాది మంది పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. సినీ గ్లామర్‌ను సామాజిక సేవకు జోడించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ సేవా కార్యక్రమాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయనను 'పద్మభూషణ్' పురస్కారంతో గౌరవించిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఇక సినిమాల విషయానికి వస్తే, 60 ఏళ్లు దాటిన వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలయ్య. ఇటీవలి కాలంలో ఆయన నటించిన 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా, సమాజానికి మంచి సందేశం ఇచ్చే కథలను ఎంచుకోవడంలో ఆయన చూపిస్తున్న చొరవను సినీ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఢిల్లీ వేదికగా బాలయ్యకు ఈ గౌరవం దక్కడంపై తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా "జై బాలయ్య" అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ, తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన బాలయ్యకు ఈ అవార్డు రావడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న బాలయ్య ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…